మలేషియా దేశంలోని కోలాలంపూర్ లో నవంబర్లో జరిగిన ‘మలేషియా’ టెక్నికల్ కోపరేషన్ ప్రోగ్రాం (ఎమ్.టి.పి.సి.) నకు భారత ప్రభుత్వం ఎన్నిక చేసిన ఇద్దరు యువ ప్రతినిధులలో ఒకరు పెంకి చైతన్యకుమార్ మన పూర్వ విద్యార్థి కావడం మనకెంతో ముదావహం. ఆసియాఖండంలో 27 దేశాల నుండి 40 మంది ప్రతినిధులలో ఒకడు ‘అమ్మి’ అనుంగుబిడ్డ.
ఆ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళాసాధికారత, పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత, శాస్త్ర సాంకేతిక రంగాలలో గల సమస్యలను గూర్చి చర్చించగా మన చైతన్య వ్యక్తపరచిన భావాలకు ముగ్ధులైన మలేషియా సెక్రటరీ జనరల్ ప్రత్యేకాభివందనలు తెలుపుచూ ప్రశంశాపత్ర మివ్వడం జరిగింది.
తాను అంతర్జాతీయ సదస్సుకు వెళ్ళడానికి కారణం ‘అమ్మ’ అనుగ్రహమేనని మరియు అమ్మబిడ్డ శ్రీమతి శారదగారు (చాగంట వెంకట్రావు గారి కుమార్తె) సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారం మరువలేనిదని మాసపత్రిక ద్వారా వారికి కృతజ్ఞతలను తెలుపుకొనుచున్నాడు.