డా|| బి.ఎల్.సుగుణ: ‘నేడు తిధుల ప్రకారం అమ్మ అనంతోత్సవము. అమ్మ అనంతత్వానికి ఉత్సవం అనంతోత్సవం. అమ్మ ఆచరణాత్మక ప్రబోధాలు నిత్య సత్యాలు, నిత్యసంస్మరణాలు, సార్వకాలికములు, మార్గదర్శకాలు – అమ్మ విశ్వజనీన తత్త్వాన్ని అందరికీ పంచటమే ఈ అంతర్జాలవేదిక ముఖ్య లక్ష్యం’ – అంటూ వక్తలకు శ్రోతలకు సభానిర్వాహకులకు శుభస్వాగతాంజలి ఘటించారు.
ప్రార్థన: శ్రీమతి ఎల్. విజయ ‘యయాశక్త్యా బ్రహ్మా’ శ్లోకాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా మనః పూర్వకంగా గానం చేసి పరమపావని అమ్మను సభక్తికంగా ప్రార్థించారు.
డా॥ యు.వరలక్ష్మి: ‘అమ్మబడిలో విద్య నభ్యసించిన విద్యార్ధిబృందం తృప్తిగా ఉద్యోగాలు చేసుకుంటూ సమైక్యతతో అమ్మ సందేశాన్ని ఆచరణలో పెడుతూ ఎన్నో సేవాకార్యక్రమాల్ని నిర్వహించటం శ్లాఘనీయం, గర్వకారణం. అమ్మయందలి అచంచల భక్తి విశ్వాసాలతో ‘ఏం చేసినా భగవంతుడే చేశాడు’ అనే స్థాయినందుకొని నిబ్బరంగా నిశ్చింతగా జీవించటం ఒక వరం. ఈ స్ఫూర్తితో పలువక్తలు పంచుకున్న అనుభూతులను వింటూంటే ఆయా వ్యక్తుల పాత్రల్లో మనం అనుభవించి, తరించి, ఆనందించి, ఓలలాడిన అనుభూతి కలుగుతోంది. అమ్మ వ్యక్తికాదు, ఆదుకునే శక్తి. కంటిలో దిగాల్సిన ముల్లు కాలిలో దిగిన చందంగా ఉంటుంది అమ్మ రక్షణ, పాలన, కరుణ. రాబోవు అమ్మ శతజయంతి ఉత్సవాల్ని మనందరం కలిసి కృషిచేసి వైభవంగా నిర్వహించుకుందాం’ – అంటూ సమర్ధ వంతంగా సర్వాంగసుందరంగా సభ నిర్వహణ కావించారు.
డా|| కె.ఎస్.ఎన్.మూర్తి; ‘కృపతో అమ్మ తనకు సన్నిహితంగా మెలిగే అదృష్టాన్ని నాకు ప్రసాదించింది.
తల్లిగా, తండ్రిగా, అన్నగా, బావగా, గురువుగా, ఆప్తబాంధవిగా, దైవంగా అనేక పాత్రల్లో ఆదరించింది, ఆదుకున్నది. నా చదువు, ఉద్యోగం, వివాహం, జీవితం సర్వస్వం అమ్మ ఆశీఃఫలమే, అనుగ్రహ విశేషమే, మహత్సంకల్పమే. ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంటే “నువ్వు నా దగ్గర ఉండాలి, నాకోసం చదువు”అంటూ హోమియో వైద్యం చదివించి, నా కోసం జిల్లెళ్ళమూడిలో ప్రభుత్వహోమియో ఆస్పత్రి స్థాపించి, నన్ను వైద్యునిగా నియమించింది. ఒకసారి పాముకాటు, మరొకసారి car accidentలో నాకు ప్రాణదానం చేసింది’ – అంటూ ఉదాహరణ పూర్వకంగా వారి విశేష విశిష్ట అనుభవ పరంపరను హృదయంగమంగా వివరించారు, అనేక కోణాల్లో అమ్మ అనంతకారుణ్యాన్ని, శక్తిని, ఆశీస్సుల్ని అభివర్ణించారు.
శ్రీమతి ఎన్.రమ: ‘అద్భుతమైన శక్తి నామరూపరహితమైన శక్తి నామరూపాలతో ‘అమ్మ’గా వచ్చి మనమధ్య తిరిగింది. మన కష్టాలు విని, మన కన్నీటిని తుడిచి, సేద తీర్చేటప్పుడు అమ్మ; మనం మ్రొక్కునేటప్పుడు పరాత్పరి; ‘నలుగురికి ఆదరంగా పెట్టుకో’ అని మార్గదర్శనం చేసినపుడు గురువు. అమ్మ మాటలను మనం ఆచరించి, అమ్మప్రేమను అందరికీ పంచాలి. మా వారికి హైవే మీద ఏక్సిడెంట్ అయితే అమ్మకు విన్నవించుకున్నాం. పెద్దనష్టం కలగకుండా కోలుకునేట్లు చేసింది. అమ్మ నన్ను రెండుమూడు సార్లు అపాయం నుంచి రక్షించింది. నాకు మొదటి కాన్పు సిజరిన్ అయింది. ఏడాదికే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. కనుక మళ్ళీ సిజరిన్ తప్పదని, కానుపు ఆందోళనకరం అన్నారు వైద్యులు. ‘అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు’అనే వాస్తవాన్ని అమ్మ ప్రబోధిస్తుంది, కానీ సమస్యలవలయంలో చిక్కుకున్నప్పుడు రక్షించి తీరైన తీరానికి చేరుస్తుంది. నా గోడు అమ్మకు చెప్పుకుందామని వెళ్ళాను. నన్ను చూడగానే అమ్మ ఎదురొచ్చి “ఎంత కాలానికి వచ్చావమ్మా! ఎన్నో నెల?” అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ నన్ను ఆలింగనం చేసుకున్నది. నా ఆందోళన ఆలకించి “భయమెందుకమ్మా? రెండవసారి ఆపరేషన్ తప్పదని నార్మల్ కాదని ఏమీలేదు. నెల్లూరులో అన్నపూర్ణకి ఆపరేషన్ టేబుల్ మీద నార్మల్ అయింది” అని ధైర్యాన్ని కలిగించింది. ఆ అన్నపూర్ణను నేనే. నాకు జరగబోయేదాన్ని పరోక్షంగా కళ్ళకి కట్టినట్లు చూపింది, కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి సంరక్షించింది”– అంటూ తమ అపూర్వ అనుభవ పూర్వకంగా అమ్మ అలౌకిక శక్తిని, ఆర్తత్రాణపరాయణతను స్పష్టం చేశారు.
శ్రీమతి వై.వి.ఎస్.లక్ష్మీరము: ‘అమ్మా! అమ్మా! ఆనందరూపిణీ’అనే రాజుబావ పాటను గంధర్వగానం మాదిరిగానం చేసి అమ్మ విశ్వరూపవైభవానికి దర్పణం పట్టారు.
శ్రీ ఎమ్.ఎస్.ప్రసాద్: ‘మా నాన్నగారు శ్రీ ఎమ్.ఎస్.ఎన్.మూర్తిగారు. వారు మద్రాసులో ఉంటూ సినీదర్శకులుగా పనిచేస్తూండేవారు. మా అమ్మ, నేను, నా తోబుట్టువులు అందరం మా అమ్మమ్మగారింట ఉండేవాళ్ళం. ‘అమ్మ’అన్నం పెడుతుంది, చదువు చెప్పిస్తుంది అని విని మేమంతా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ నీడలో ఉంటున్నాం. అమ్మ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టే క్రమంలో మా నాన్నగారు వచ్చి అమ్మ పాదసన్నిధిలో ఉన్నారు. అమ్మ కబురుచేయటంతో మేము అక్కడికి వెళ్ళాం. భార్యాబిడ్డల్నిచూసి మా నాన్నగారూ, వారిని చూసి మేమూ ఆశ్చర్య ఆనందాలలో ఓలలాడాము. అమ్మ లీల, వైచిత్రి అది. జిల్లెళ్ళమూడిలో విద్యనభ్యసించి ఉద్యోగరంగంలో నేను ఉన్నత స్థితికి వెళ్ళగలిగానంటే దానికి కారణం అమ్మదయ, అమ్మ పెట్టిన భిక్ష. బ్రైన్ పనిచెయ్యని స్థితిలోకూడా నా కన్నతల్లి అయత్న పూర్వకంగా, సహజంగా అమ్మ నామ స్మరణ జపం చేస్తుంది. మా కుటుంబ సభ్యులకు అమ్మ కృపే శ్రీరామ రక్ష. శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యనిర్వాహకు లకు, అందరింటి అన్నయ్యలు అక్కయ్యలు అందరికీ శతధా ఋణపడి ఉన్నాం’ అంటూ అనుపమ అనుభూతులతో వాస్తవాలకి దర్పణంపడుతూ హృద్యంగా గంభీరంగా ప్రసంగించారు.
శ్రీ బి.శంకరరావు: సర్వత్రా సమదృష్టి కలిగిన సమతా . మమతామృతమూర్తి’ అమ్మ. ఒక ఉదాహరణ: ఒకనాడు తూ.గో. జిల్లా నుండి కొందరు పండితులు కారులో వచ్చారు అమ్మదర్శనార్ధం. వారందరినీ దుశ్శాలువలతో సమ్మానించి ఆనందించింది అమ్మ. అంతేకాదు. వారి కారు డ్రైవర్కి కబురు చేసి ఆతనిని కూడా శాలువతో సత్కరించింది. అందుకు ఆశ్చర్యపోయి ఆ డ్రైవర్ ‘అమ్మా! నేను పండితుడ్ని కాదు కదా!’ అన్నాడు. వెంటనే అమ్మ “నీ వృత్తి కారు నడపటం. అందులో నువ్వు పండితుడవే”అన్నది చిరునవ్వుతో. అన్నపూర్ణాలయంలో అమ్మ ప్రసాదించిన అమృతాహారాన్ని స్వీకరించిన ఫలితంగా మేము పలురంగాల్లో రాణిస్తున్నాము. ఉత్తమమగు అమ్మఒడిని ఉచితముగ విద్యను అభ్యసించాము. అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయాలను స్థాపించిన అమ్మ తత్త్వములో సామాజిక దృక్పధము, మానవీయ విలువలు పరిమళించి పునీతంచేస్తాయి’ అంటూ తేటగీతి పద్యసౌరభాల నడుమ మృదుమధురంగా ప్రసంగించారు.
శ్రీమతి ఎల్.విజయశ్రీ: ‘అమ్మా! నే నిన్ను వీడ, నీ వాడ, నే నన్యులవేడ’ గీతాన్ని ‘పరదైవాలు పలుదైవా లతో పనిలేదు, అమ్మ శ్రీచరణసమాశ్రయమే సర్వార్ధదాయకం’ అనే తాత్పర్యంతో వీనులవిందుగా గానం చేశారు.
శ్రీమతి బి.ఎల్.సుగుణ: ఆర్తితో, అనుభూతి ప్రదంగా తమ అమూల్య అనుభవాలను పంచిన వక్తలకు, ఆసక్తితో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన శ్రోతలకు, కర్ణపేయంగా గానం చేసి అలరించిన గాయనీమణులకు, విశిష్ట మహిళాపురస్కారాన్ని అందుకుని కళాశాల విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ రసరమ్యంగా సర్వాంగ సుందరంగా సభను నిర్వహించిన డా॥ యు. వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలిపారు. 1-8-2021 న అమ్మకు అక్షరార్చన నిర్వహించుకుందాం అని సభ ముగించారు.
డా|| బి.ఎల్.సుగుణ: ‘నేడు తిధుల ప్రకారం అమ్మ అనంతోత్సవము. అమ్మ అనంతత్వానికి ఉత్సవం అనంతోత్సవం. అమ్మ ఆచరణాత్మక ప్రబోధాలు నిత్య సత్యాలు, నిత్యసంస్మరణాలు, సార్వకాలికములు, మార్గదర్శకాలు – అమ్మ విశ్వజనీన తత్త్వాన్ని అందరికీ పంచటమే ఈ అంతర్జాలవేదిక ముఖ్య లక్ష్యం’ – అంటూ వక్తలకు శ్రోతలకు సభానిర్వాహకులకు శుభస్వాగతాంజలి ఘటించారు.
ప్రార్థన: శ్రీమతి ఎల్. విజయ ‘యయాశక్త్యా బ్రహ్మా’ శ్లోకాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా మనః పూర్వకంగా గానం చేసి పరమపావని అమ్మను సభక్తికంగా ప్రార్థించారు.
డా॥ యు.వరలక్ష్మి: ‘అమ్మబడిలో విద్య నభ్యసించిన విద్యార్ధిబృందం తృప్తిగా ఉద్యోగాలు చేసుకుంటూ సమైక్యతతో అమ్మ సందేశాన్ని ఆచరణలో పెడుతూ ఎన్నో సేవాకార్యక్రమాల్ని నిర్వహించటం శ్లాఘనీయం, గర్వకారణం. అమ్మయందలి అచంచల భక్తి విశ్వాసాలతో ‘ఏం చేసినా భగవంతుడే చేశాడు’ అనే స్థాయినందుకొని నిబ్బరంగా నిశ్చింతగా జీవించటం ఒక వరం. ఈ స్ఫూర్తితో పలువక్తలు పంచుకున్న అనుభూతులను వింటూంటే ఆయా వ్యక్తుల పాత్రల్లో మనం అనుభవించి, తరించి, ఆనందించి, ఓలలాడిన అనుభూతి కలుగుతోంది. అమ్మ వ్యక్తికాదు, ఆదుకునే శక్తి. కంటిలో దిగాల్సిన ముల్లు కాలిలో దిగిన చందంగా ఉంటుంది అమ్మ రక్షణ, పాలన, కరుణ. రాబోవు అమ్మ శతజయంతి ఉత్సవాల్ని మనందరం కలిసి కృషిచేసి వైభవంగా నిర్వహించుకుందాం’ – అంటూ సమర్ధ వంతంగా సర్వాంగసుందరంగా సభ నిర్వహణ కావించారు.
డా|| కె.ఎస్.ఎన్.మూర్తి; ‘కృపతో అమ్మ తనకు సన్నిహితంగా మెలిగే అదృష్టాన్ని నాకు ప్రసాదించింది.
తల్లిగా, తండ్రిగా, అన్నగా, బావగా, గురువుగా, ఆప్తబాంధవిగా, దైవంగా అనేక పాత్రల్లో ఆదరించింది, ఆదుకున్నది. నా చదువు, ఉద్యోగం, వివాహం, జీవితం సర్వస్వం అమ్మ ఆశీఃఫలమే, అనుగ్రహ విశేషమే, మహత్సంకల్పమే. ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంటే “నువ్వు నా దగ్గర ఉండాలి, నాకోసం చదువు”అంటూ హోమియో వైద్యం చదివించి, నా కోసం జిల్లెళ్ళమూడిలో ప్రభుత్వహోమియో ఆస్పత్రి స్థాపించి, నన్ను వైద్యునిగా నియమించింది. ఒకసారి పాముకాటు, మరొకసారి car accidentలో నాకు ప్రాణదానం చేసింది’ – అంటూ ఉదాహరణ పూర్వకంగా వారి విశేష విశిష్ట అనుభవ పరంపరను హృదయంగమంగా వివరించారు, అనేక కోణాల్లో అమ్మ అనంతకారుణ్యాన్ని, శక్తిని, ఆశీస్సుల్ని అభివర్ణించారు.
శ్రీమతి ఎన్.రమ: ‘అద్భుతమైన శక్తి నామరూపరహితమైన శక్తి నామరూపాలతో ‘అమ్మ’గా వచ్చి మనమధ్య తిరిగింది. మన కష్టాలు విని, మన కన్నీటిని తుడిచి, సేద తీర్చేటప్పుడు అమ్మ; మనం మ్రొక్కునేటప్పుడు పరాత్పరి; ‘నలుగురికి ఆదరంగా పెట్టుకో’ అని మార్గదర్శనం చేసినపుడు గురువు. అమ్మ మాటలను మనం ఆచరించి, అమ్మప్రేమను అందరికీ పంచాలి. మా వారికి హైవే మీద ఏక్సిడెంట్ అయితే అమ్మకు విన్నవించుకున్నాం. పెద్దనష్టం కలగకుండా కోలుకునేట్లు చేసింది. అమ్మ నన్ను రెండుమూడు సార్లు అపాయం నుంచి రక్షించింది. నాకు మొదటి కాన్పు సిజరిన్ అయింది. ఏడాదికే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. కనుక మళ్ళీ సిజరిన్ తప్పదని, కానుపు ఆందోళనకరం అన్నారు వైద్యులు. ‘అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు’అనే వాస్తవాన్ని అమ్మ ప్రబోధిస్తుంది, కానీ సమస్యలవలయంలో చిక్కుకున్నప్పుడు రక్షించి తీరైన తీరానికి చేరుస్తుంది. నా గోడు అమ్మకు చెప్పుకుందామని వెళ్ళాను. నన్ను చూడగానే అమ్మ ఎదురొచ్చి “ఎంత కాలానికి వచ్చావమ్మా! ఎన్నో నెల?” అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ నన్ను ఆలింగనం చేసుకున్నది. నా ఆందోళన ఆలకించి “భయమెందుకమ్మా? రెండవసారి ఆపరేషన్ తప్పదని నార్మల్ కాదని ఏమీలేదు. నెల్లూరులో అన్నపూర్ణకి ఆపరేషన్ టేబుల్ మీద నార్మల్ అయింది” అని ధైర్యాన్ని కలిగించింది. ఆ అన్నపూర్ణను నేనే. నాకు జరగబోయేదాన్ని పరోక్షంగా కళ్ళకి కట్టినట్లు చూపింది, కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి సంరక్షించింది”– అంటూ తమ అపూర్వ అనుభవ పూర్వకంగా అమ్మ అలౌకిక శక్తిని, ఆర్తత్రాణపరాయణతను స్పష్టం చేశారు.
శ్రీమతి వై.వి.ఎస్.లక్ష్మీరము: ‘అమ్మా! అమ్మా! ఆనందరూపిణీ’అనే రాజుబావ పాటను గంధర్వగానం మాదిరిగానం చేసి అమ్మ విశ్వరూపవైభవానికి దర్పణం పట్టారు.
శ్రీ ఎమ్.ఎస్.ప్రసాద్: ‘మా నాన్నగారు శ్రీ ఎమ్.ఎస్.ఎన్.మూర్తిగారు. వారు మద్రాసులో ఉంటూ సినీదర్శకులుగా పనిచేస్తూండేవారు. మా అమ్మ, నేను, నా తోబుట్టువులు అందరం మా అమ్మమ్మగారింట ఉండేవాళ్ళం. ‘అమ్మ’అన్నం పెడుతుంది, చదువు చెప్పిస్తుంది అని విని మేమంతా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ నీడలో ఉంటున్నాం. అమ్మ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టే క్రమంలో మా నాన్నగారు వచ్చి అమ్మ పాదసన్నిధిలో ఉన్నారు. అమ్మ కబురుచేయటంతో మేము అక్కడికి వెళ్ళాం. భార్యాబిడ్డల్నిచూసి మా నాన్నగారూ, వారిని చూసి మేమూ ఆశ్చర్య ఆనందాలలో ఓలలాడాము. అమ్మ లీల, వైచిత్రి అది. జిల్లెళ్ళమూడిలో విద్యనభ్యసించి ఉద్యోగరంగంలో నేను ఉన్నత స్థితికి వెళ్ళగలిగానంటే దానికి కారణం అమ్మదయ, అమ్మ పెట్టిన భిక్ష. బ్రైన్ పనిచెయ్యని స్థితిలోకూడా నా కన్నతల్లి అయత్న పూర్వకంగా, సహజంగా అమ్మ నామ స్మరణ జపం చేస్తుంది. మా కుటుంబ సభ్యులకు అమ్మ కృపే శ్రీరామ రక్ష. శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యనిర్వాహకు లకు, అందరింటి అన్నయ్యలు అక్కయ్యలు అందరికీ శతధా ఋణపడి ఉన్నాం’ అంటూ అనుపమ అనుభూతులతో వాస్తవాలకి దర్పణంపడుతూ హృద్యంగా గంభీరంగా ప్రసంగించారు.
శ్రీ బి.శంకరరావు: సర్వత్రా సమదృష్టి కలిగిన సమతా . మమతామృతమూర్తి’ అమ్మ. ఒక ఉదాహరణ: ఒకనాడు తూ.గో. జిల్లా నుండి కొందరు పండితులు కారులో వచ్చారు అమ్మదర్శనార్ధం. వారందరినీ దుశ్శాలువలతో సమ్మానించి ఆనందించింది అమ్మ. అంతేకాదు. వారి కారు డ్రైవర్కి కబురు చేసి ఆతనిని కూడా శాలువతో సత్కరించింది. అందుకు ఆశ్చర్యపోయి ఆ డ్రైవర్ ‘అమ్మా! నేను పండితుడ్ని కాదు కదా!’ అన్నాడు. వెంటనే అమ్మ “నీ వృత్తి కారు నడపటం. అందులో నువ్వు పండితుడవే”అన్నది చిరునవ్వుతో. అన్నపూర్ణాలయంలో అమ్మ ప్రసాదించిన అమృతాహారాన్ని స్వీకరించిన ఫలితంగా మేము పలురంగాల్లో రాణిస్తున్నాము. ఉత్తమమగు అమ్మఒడిని ఉచితముగ విద్యను అభ్యసించాము. అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయాలను స్థాపించిన అమ్మ తత్త్వములో సామాజిక దృక్పధము, మానవీయ విలువలు పరిమళించి పునీతంచేస్తాయి’ అంటూ తేటగీతి పద్యసౌరభాల నడుమ మృదుమధురంగా ప్రసంగించారు.
శ్రీమతి ఎల్.విజయశ్రీ: ‘అమ్మా! నే నిన్ను వీడ, నీ వాడ, నే నన్యులవేడ’ గీతాన్ని ‘పరదైవాలు పలుదైవా లతో పనిలేదు, అమ్మ శ్రీచరణసమాశ్రయమే సర్వార్ధదాయకం’ అనే తాత్పర్యంతో వీనులవిందుగా గానం చేశారు.
శ్రీమతి బి.ఎల్.సుగుణ: ఆర్తితో, అనుభూతి ప్రదంగా తమ అమూల్య అనుభవాలను పంచిన వక్తలకు, ఆసక్తితో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన శ్రోతలకు, కర్ణపేయంగా గానం చేసి అలరించిన గాయనీమణులకు, విశిష్ట మహిళాపురస్కారాన్ని అందుకుని కళాశాల విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ రసరమ్యంగా సర్వాంగ సుందరంగా సభను నిర్వహించిన డా॥ యు. వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలిపారు. 1-8-2021 న అమ్మకు అక్షరార్చన నిర్వహించుకుందాం అని సభ ముగించారు.