క్రితం రాత్రికి అందరము చేరితిమి. తెల్లవారు జాముననే అందరు స్నానములకు వెళ్ళినపుడు బాబుగారు (శ్రీ కొ.ల.యోగిగారు) మాత్రము ఇంటి వద్ద ఉండిరి. తిరిగి వచ్చిన వారిలో కోన సుబ్బారావుగారు ముందుగా వచ్చిరి. వారి వల్ల జరిగినది తెలిసికొనిరి. అమ్మ ఓంకారనదిలో (నల్లమడ వాగులో) స్నానములు చేసిన పిదప అందరికి మంత్రోపదేశము – గురుబ్రహ్మ…. శ్రీ గురవేనమః అని దురా? చెప్పించి సోహం అని చెవిలో చెప్పిరి – చెప్పించిరి – శేషు) అందరు వచ్చినపుడు అమ్మ వచ్చి దగ్గరగా కూర్చొనిరి.
కాం : (అప్పటివరకు మంచం మీద కూర్చుని యుండిరి) అమ్మా ! నీవు క్రింద కూర్చుండగా నేను మంచం మీద ఎందుకు ?
అమ్మ: అందరము భూమి మీదనే ఆధారపడి : యున్నాము. మీరు కూర్చొనిన మంచపు కోళ్ళకు భూమియే ఆధారము. ఎత్తుకాదు కావలసినది.
కాం : అమ్మా ! ఎవరెవరి అర్హతల ప్రకారం వారి వారికి యోగ్యమైనవి (మంత్రములు) ఇచ్చి వేస్తిరా!
అమ్మ : అందరికి ఒకే మంత్రము – పిల్లిమంత్రము.
(అమ్మ జీవితచరిత్రలో పిల్లి మరణము- శ్వాస ఆగడమూ మొదలైనవి. అమ్మ పరీక్షించడం కనపడుతుంది. పిల్లి మొగ్గ లేక పిల్లి మంత్రము అంటే తలక్రిందులు గావడం అనీ వాడుకలో అర్థం ఉంది. పల్టీకొట్టడం అనీ అంటారు
తరువాత పొగాకు పాకలో అందరు చేరగా బాబుగారు శివోహం అనునది తీసుకొని వేదాంత విచారం సాగించిరి.
అమ్మ, తాను చెప్పినది అదికాదనియు, ‘సోహం’ అనియు చెప్పినపుడు, తిరిగి అదే సమర్థించిరి. ఇంతలో రాజు కెందులకు ? (బుచ్చిరాజు శర్మగారు) అమ్మను ఎత్తికొని తీసుకు వెళ్ళిరి.
తరువాత కొత్తగా వేసిన పాకలో (మందిరములో). కాం: మీరు కట్టించు దేవాలయమునందే ప్రతిష్ఠ చేయనెంచిరి ?
అమ్మ : పంచాయతనము (కాయలు, ఇసుక కుప్పలు పెట్టిరి సాంకేతికముగా ఔననుకొనిరి)
రాజుగారిచే పాటలు పాడించిరి. శ్రీ రాజరాజేశ్వరీ మొదలగు పాటలు పాడిరి.
కాం : శ్రీ రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి, రాజేశ్వరి అనుటలో భేదములు గలవు.
బుచ్చిరాజు శర్మగారు ఆ విశేష భేదములు తెల్పుదురా?
కాంతయ్య బాబుగారు (రాజును చిన్న పిల్లవానిగా పరిగణించి) పల్లకి ఎక్కి ఊరేగినపుడున్న సంతోషము భార్య కాపురమునకు వచ్చిన తెలియును. (కష్టనష్టములు, బాధ్యతలు మొదలగునవి)
ఇంతలో అమ్మ ఒక అరటిపండు తొక్కవొలిచి
అమ్మ : దీనికి మూలకారణమేమి?
కాం : మహదహంకార ప్రకృతులు – అని మొదలిడి – ఇట్టివి బహిరంగంగా తెలుపవలనుపడదు. ఇప్పటికీ మా కిచ్చిన కాఫీ విలువకంటె ఎక్కువ మాట్లాడినాము అని లేచి వెళ్లిరి.
దరిమిలా బాబుగారు, స్థానం నరసింహారావు గారు బయలు దేరుచుండగా ఒకరు ‘ఎక్కడికి బాబుగారు’ అని
కాం : నన్ను గోపాలరావు అనునతడు ఈ స్థలములో మంచినీరెక్కడ పడునో చూడమని అడిగిరి. అందులకు పోవుచున్నాను.
బ: ఇది ఏమి ధర్మము ? మిమ్ములను అమ్మగాని, నాన్నగారు, బామ్మగారు గాని – వీరిలో ఎవరూ అడుగలేదు గదా ! ఎవరో మరి యొకరి ఇంట సంగతి అడుగగా మీ కెందులకు.
కాం సబబుగానే యున్నది. మంచి చిన్నవారు చెప్పినను వినవలె.
మరుదినము గోపాలరావడిగిన సంగతి బాబుగారే ప్రస్తావించగా అమ్మ సరే, మంచిది చూపుడని కోరిన పిదపనే వారు బయలుదేరి ఆవరణమంతయు తిరుగుచు పరీక్షల జరిపిరట. అమ్మ ఈ ఊరిలో మంచినీరు పడవు. ఉప్పునీళ్లు తప్ప అనిరి.
బాబుగారు కొన్ని తావుల తిరిగి తాము 50 అడుగు లోతు వరకు వెళ్ళి పరిశీలించితిమనియు ఎచటను దొరకలేదు, అనిరి. పిమ్మట ప్రస్తుతము శేషగిరిరావుగారు అమ్మ కొరకై వేసిన ఇంటికి గుంటూరు కుమారస్వామిగారు వేసిన పాకకు మధ్యలో ఒక తావునను, పుట్టమట్టి నోటిలో వేసికొని చూచి అచటనైన; మూడవదిగా ఊరి వెలుపల గల ఒక తావును మూడింటిని చూపిరట.
దరిమిలా పొన్నూరు నుండి వెంకటేశ్వర్లుగారు బోరింగుపైపు తెచ్చి (కుమారస్వామిగారు పాకవేయక ముందే) బాబుగారు చూపిన తావున చాల వరకు పైపులు దింపిరిగాని ప్రయోజనం లేకపోయెను. శ్రీ వెంకటేశ్వర్లుగారు గూడ పట్టుదలతో నీరు పడునంత వరకు భోజనము చేయునని లేదు. పనిచేయించిరి గాని ప్రయోజనము లేకపోయెను.
తరువాత కాలములో పానీవాలా తాను మూడు వేల పంపులు వేయించగా అఖండ ప్రవాహము వచ్చెనని బోరింగు వేయించి చాలా లోతుకు పోగా తళుకు రాళ్ళు కన్పించగా ఇక నీరు పడదని నిర్ధారించుకొని, ఏదో పని మీద వెళ్లినట్లు హోల్డాలు కట్టించుకొని వెళ్ళిపోయిరి. డిపార్టుమెంటు వారిచే మిషను తెప్పించమని సలహానిచ్చి వెళ్లిరి. కాని ఒక వారము తర్వాత గొట్టములు పెరికి వైచిరి. వారెక్కడికి వెళ్ళి ని అన్నమాట ప్రకారము తిరిగి రాలేదు.
కొంతకాలమైన పిదప అమ్మయే ప్రస్తుతము బావియున్న చోట చెప్పగా బావి తీయించి, చీరాల నుండి సిమెంటు వరలు తెప్పించి ఏర్పాటు చేసిరి. నీరు మాత్రము ఉప్పగా నుండెను. వర్షాకాలములో ఎక్కువగాను, ఎండకాలములో తక్కువగాను ఉండును గాని వట్టిపోవుట లేదు.
(మదర్ ఆఫ్ ఆల్ 2011 ఏప్రిల్ – జూన్ సంచిక నుండి)