ఆగష్టు 15వ తేదీ ఉదయం 8 గంటలకు అన్నపూర్ణాలయ వార్షికోత్సవం సందర్భంగా అందరింటిలో అమ్మ | పతాక ఆవిష్కరణ ఆనందదాయకంగా జరిగింది. మన సంస్థల అధ్యక్షులు శ్రీ ఎం. దినకర్గారు అమ్మ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యక్షులు శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తిగారు అన్నపూర్ణాలయ ప్రశస్తిని వివరిస్తూ, అమ్మలోని | విశ్వమాతృత్వాన్ని కీర్తించారు. సుప్రభాత గీతాలతో, అమ్మనామ సంకీర్తనతో ఆనాటి తెల్లవారు జామున ప్రారంభమైన
అన్నపూర్ణాలయ వార్షికోత్సవ సంరంభం అందరికీ ఆనందం కలిగించింది.