(జగద్గురువులు, శ్రీశ్రీశ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి, కుర్తాళం పీఠాధిపతులు)
‘లోకమ్ములో నెట్టులుండిన గాని
నీకడ బాలుడీ నిష్ణాయుతుండు
నిను గుండెలో నేడు నిలుపుకున్నాడు.
తన నిత్యమాతగా తలచుచున్నాడు.
ఏచోట ఏరీతి నెసగిన గాని
నీ చెంత వినయాన నిలుచునీతండు
మనసులో ఒకసారి మమతతో
నను భార్గవుని కులనాథుని కనుము
పల్లవారుణమైన బంగారుబొమ్మ
జిల్లెళ్ళమూడిలో చెలువొందు అమ్మ.
బహుజన్మములనుండి బడలినవాడు
విహితధర్మమ్మున వెలసినవాడు
(28.03.2023 – అమ్మ శతజయంతి సభలో స్వామివారి ప్రసంగం చివరలో వినిపించిన కవిత)