అమ్మను 1950వ దశకంలో దర్శించుకొని అనేక అనుభవములను పొందిన కీ॥శే॥ మేళ్ళ చెరువు లింగేశ్వరరావు గారి పుత్రుడు, మా అల్లుడు అయిన చి.వెంకట రామసాయిబాబు తమ షష్టిపూర్తి వేడుకను ది. 28.10.2012 ఆదివారం నాడు అమ్మ సన్నిధిలో జరుపుకున్నారు. దీనిలో ప్రత్యేకత ఏమంటే శ్రీసాయిబాబు గారి వివాహము అమ్మ చేతుల మీదుగా జరిగింది. ఏవేదిక మీద అమ్మ వీరి వివాహము జరిపించిందో అదే వేదిక మీద యీ వేడుకను గూడ జరుపుకున్నారు.
1976 వ సంవత్సరములో వివాహమప్పుడు సంస్థలోని అందరూ ఏ విధంగా వివాహ కార్యక్రమము జరిపించారో అదే రీతిగా మొన్న 28వ తారీఖునాడు కూడ అందరూ అన్ని విధాల సహాయ సహకారము లందించి కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించారు.