ఈ నెల 13వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జిల్లెళ్ళమూడి గ్రామస్థులు అందరి సభ్యులు శ్రీ PSR ఆంజనేయ ప్రసాద్ అన్నయ్యగారు అమ్మలో ఐక్యమయి 30 రోజులు నిండిన సందర్భంగా అమ్మ నామ సంకీర్తన ఎంతో భక్తితో చేసి |అమ్మ దివ్య చరణాలకు సమర్పించారు.
శ్రీ వూర్ణానంద స్వామి (శ్రీశైలం) భక్తులు, హైదరాబాద్, చెన్నై నుంచి దాదాపు 15 మంది 13వ తారీఖున జిల్లెళ్ళమూడి చేరుకొన్నారు. వీరికి 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు శ్రీ బి. రాధాకృష్ణమూర్తిగారు నేతృత్వం వ హించారు. అలాగే గుంటూరు వాస్తవ్యులు శ్రీ కోటంరాజు తిలక్ గారు తమ అమూల్య సహకారం అందించారు. శ్రీ రాధాకృష్ణ మూర్తి గారికి శ్రీ వూర్ణా నందస్వామి వారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండటమే కాకుండా స్వామి వారి శ్రీశైలం ఆశ్రమంలో చాలా సంవత్సరాలు తమ సేవలను అందించారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు అమ్మ దర్శనానికై జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు మూర్తిగారు కూడా వెంటనే జిల్లెళ్ళమూడి చేరుకొని అమ్మను దర్శించుకున్నారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు అమ్మ దగ్గరకు అనేకమార్లు వచ్చారు. మన సోదర సోదరీమణుల కెందరికో వారు కూడా పూజనీయులు. ఈ భక్త బృందం జిల్లెళ్ళమూడిలో హెూమాలు చేసుకోవాలనే కోరికతో వచ్చారు. 14వ తేదీన గణపతి హెూమము, నవగ్రహ హెూమము చేసిన తరువాత రుద్ర హెూమము చేశారు. 15వ తేదీన చండీ హెూమము చేశారు. సంస్థలో ఉన్న వూజారులు, వేదపాఠ శాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఆ రెండు రోజులు ఆలయ -ప్రాంగణం అంతా వేదఘోషతో మారుమ్రోగింది..
శ్రీ కార్యక్రమాల ముగింపు సందర్భంగా హెూదు కార్యక్రమాలలో పాల్గొన్న వారికి అమ్మ ప్రసాదపూర్వక వస్త్ర ప్రదానం సంస్థ వారు అందించారు. ఆ భక్త బృందం ఇలాంటి హెూదు కార్యక్రమాలు భవిష్యత్ లో కూడా ఇక్కడ నిర్వహించుకోవాలనే కోరికను అభివ్యక్తం చేస్తూ సంతృప్తితో తిరిగి వెళ్ళారు.
19 మార్చి సాయంత్రం 7.30 గంటలకు చిరంజీవి ముదిగొండ ధృతి అనసూయేశ్వరాలయంలో అమ్మ సమక్షంలో తన కూచిపూడి నాట్యప్రదర్శన ఇచ్చింది. 13 ఏళ్ళ చిరుప్రాయంలో మంచి హావభావాలతో, అంగ విన్యాసంతో “ముద్దుగారే యశోద, భో శంభో” కీర్తనలకు చక్కగా నాట్యం చేసి చూపరులను ఆకట్టుకొంది. ఈ చిన్నారి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ముదిగొండ ఉమామహేష్, నీరజల సుపుత్రిక. ధృతి నాలుగు సంవత్సరాలు శ్రీమతి ఉషా గోటేటి గారి దగ్గర నాట్యం నేర్చుకొంది..
చి. ధృతి మొట్టమొదటిసారి బయట ప్రదర్శన అమ్మ దగ్గరనే చేయాలనే కోరికతో జిల్లెళ్ళమూడి వచ్చింది.
నాట్యంలో ఎంతో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాలని కోరుతూ అమ్మ ఆశీర్వచన పూర్వకంగా చిరంజీవి ధృతికి సంస్థ వారు వస్త్ర ప్రదానం చేశారు. అలాగే వారి తల్లిదండ్రులకు, బంధువర్గానికి కూడా అమ్మ ఆశీస్సులు, వస్త్రాలు అందించారు.