1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అర్కపురి విశేషాలు

అర్కపురి విశేషాలు

K lathika
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : January
Issue Number : 6
Year : 2011

25-11-2010 : సంకటహర చతుర్థి విశేషహోమము మహాగణపతిహోమము, మహాగణపతి చతురావృత తర్పణం జరిగాయి. ఒక సంవత్సరంగా దీక్షగా ప్రతినెల శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ కమల గుంటూరు నుండి వచ్చి గణపతి హోమము, అభిషేకం జరుపుకుంటున్నారు. హోమానంతరం సాయంత్రం మహాగణపతికి వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేసారు. శాంతి కల్యాణం జరిపించారు. పై కార్యక్రమములు శ్రీ అవ్వారి ఉమాశంకర దీక్షితుల ఆధ్వర్యంలో జరిగాయి. నాగేశ్వరాలయంలో కార్తీకమాసం అంతా ప్రతిరోజు 11 రుద్రాలతో అభిషేకం జరిపించారు. అందరికీ ప్రసాదం అందచేశారు. 

కార్తీకమాసం సందర్భంగా ఓరియంటల్ కాలేజి విద్యార్ధినులు అన్ని ఆలయాలలో సాయంత్రం ప్రమిదలలో దీపాలు వెలిగించి అందంగా అలంకరించారు. శ్రీమతి నండూరు నాగమణిగారు (వార్డెన్) ఆధ్వర్యం వహించారు.

27-11-2010 : శ్రీ భువనేశ్వరీ పీఠం (గన్నవరం) ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ సత్యానందభారతీ స్వామివారు శ్రీ హైమవతీదేవి జన్మదిన సందర్భంగా స్వామివారు అమ్మ హైమాలయాలు దర్శించుకుని జ్యోతి ప్రజ్వలనంగావించి లలితకోటి పారాయణ ప్రారంభిస్తూ అమ్మకు లలితాదేవికి వున్న అందించారు. అనుబంధం జనరంజకంగా వివరించారు.

04-12-2010 : విజయవాడ నుండి వచ్చిన పి.వి.హిందూ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు అమ్మ హైమల ఆలయాలు, అమ్మకు సంబంధించినవి అన్నీ వివరంగా అడిగి తెలుసుకుని, అమ్మ ప్రసాదం స్వీకరించారు.

04-12-2010 : ఆవరణలోని వారికి ఓరియంటల్ కాలజీ విద్యార్థిని విద్యార్థులకు ఆలయముల ప్రాంగణములో కార్తీక వనభోజనాలు జరిగాయి. శ్రీ హనుమబాబు కార్యక్రమ నిర్వహణ చేశారు.

17-12-2010 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనసూయేశ్వరాలయంలో ఉత్తర ద్వారదర్శనం కన్నుల పండువగా జరిగింది. ఉదయం 5 గంటలకు ఆవరణలోని వారు ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణములు చేసి ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి అందరూ అమ్మను దర్శించుకున్నారు. ఆ రోజు ఆలయంలోని మూల విరాట్టు కిరీటం, శంఖం, చక్రం తులసిమాల గజమాలతో నర్వాలంకార భూషితగా అలంకరించారు. ఆలయంలో విష్ణు సహస్రనామాలు పారాయణ చేయుచుండగా పూజ చేసుకున్నారు. అందరూ భజన చేశారు. ఐ.హనుమబాబుగారు ధనుర్మాసం మొదటి రోజుగాన తిరుప్పావై చదివి అందరికీ అర్థం చెప్పారు. మంగళహారతి అనంతరం ప్రసాద వితరణ జరిగింది.

ముక్కోటి సందర్భంగా శ్రీ బి.జె.కె. శాస్త్రిగారి సతీమణి శ్రీమతి సుబ్బలక్ష్మి 11 కన్యలకు పూజ చేసుకొని నూతన వస్త్రాలు బహూకరించారు. ఏకాదశి సందర్భంగా అనసూయేశ్వరాలయంలో శాస్త్రి దంపతులతో పాటు ఎమ్.వి. సుబ్బలక్ష్మి, రాచర్ల కమల, మన్నవ జయ, శ్రీమతి సరస్వతి, ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం దంపతులు, వారి చిరంజీవి హైమ అనసూయావ్రతం చేసుకున్నారు.

19-12-2010 : శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ రాచర్ల నరసింహమూర్తి గారి మనుమరాలు, మన కాలేజీ పూర్వ విద్యార్థిని కె. సాయిసుధ వివాహం విజయనగరం వాస్తవ్యులు శ్రీ గంటి దుర్గాప్రసాద్ శ్రీమతి సరస్వతి గార్ల కుమారుడు గంటిసాయి రత్నంతో వివాహం ఈనాడు విజయనగరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆవరణలో అందరికీ అమ్మ ప్రసాదం అందించారు. 

20-12-2010 : శ్రీ సీతంరాజు నరసింహరావు దంపతులు తమ కుమార్తె చి||ల||సౌ|| హైమ చి॥ వెంకట విశ్వనాధ్ వివాహం 16-12-2010న హైదరాబాద్లో జరుపుకుని జిల్లెళ్ళమూడి వచ్చి అనసూయేశ్వరాలయంలో అనసూయావ్రతం జరుపుకున్నారు. ఆవరణలోని వారికి విద్యార్థినీ విద్యార్థులకు అమ్మ ప్రసాదం అందించారు.

23-12-2010 : జిల్లెళ్ళమూడి వాస్తవ్యులు శ్రీ కఠారి చిరంజీవి శ్రీమతి లక్ష్మి తమ 3 నెలల బాబుకు అమ్మ సమక్షంలో పూజారి కిశోరు ఆధ్వర్యంలో చి॥కార్తీక్ అని నామకరణ జరుపుకొన్నారు.

23-12-2010 : హైదరాబాదు వాస్తవ్యులు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి అమ్మ దర్శనం అనంతరం అమ్మ అందరింటి వేదికపై మధ్యాహ్న భోజన సమయంలో అమ్మ నామం కడురమ్యంగా ఆలపించి అందరినీ ముగ్ధులను చేసారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!