మానవాతీతమైన దివ్యశక్తులతో సకల లోకారాధ్యగా ఉన్నా, గృహిణిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ‘అమ్మ’ ఎన్నడూ ఏమరుపాటు చెందలేదని శ్రీమతి ఎ. కుసుమా చక్రవర్తి వివరించారు. జులై 13వ తేది శనివారం సాయంత్రం 6 గంటలకు మచిలీపట్నం శంకరమఠంలో జరిగిన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న విశాఖపట్నం మాతృశ్రీ అధ్యయనపరిషత్ అధ్యక్షులు శ్రీమతి కుసుమా చక్రవర్తి “ఆదర్శగృహిణి అమ్మ” అనే అంశంపై ప్రసంగించారు. ఇల్లాలుగా తన బాధ్యతను నిర్వ హించడంలో అమ్మ ప్రవర్తించిన తీరు గృహములందరికీ ఆదర్శప్రాయమని శ్రీమతి కుసుమాచక్రవర్తి పేర్కొన్నారు.
శ్రీ ఆర్.డి.యల్.నరసింహమూర్తి నేతృత్వంలో వారి తల్లి పేరిట జరిగిన “శ్రీమతి రాళ్ళబండి అనసూయమ్మగారి స్మారకోపన్యాససభ”కు అమ్మ తత్త్వప్రచార సమితి అధ్యక్షులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ ప్రపంచంలో ఆకలిబాధ లేకుండా పోయే రోజు రావాలన్నదే అమ్మ ఆశయమని, సేవ, ప్రేమ రెండు కన్నులుగా మానవులు వ్యక్తిత్వ వికాసం పొందడానికి అమ్మ
సందేశం కరదీపిక – అని అధ్యక్షులు వివరించారు.
శ్రీ నవకళా ధియేటర్ ప్రొప్రయిటర్ శ్రీ యస్. ఆర్. వై.ప్రసాద్ అమ్మసన్నిధిలో తమ అనుభవాలను వివరించారు.
రాళ్ళభండి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభాప్రారంభకులు శ్రీ ఆర్.డి.యల్. నరసింహమూర్తి మాట్లాడుతూ, తమ తల్లిగారి గుణగణాలను వివరించారు. తమ తల్లి పేరిట “విశ్వజనని అమ్మ”ను గురించి సభ నిర్వహించాలనుకున్న తమ కోరిక నెరవేరినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీ ఆర్. రాజారాం శ్రీమతి అనసూయమ్మగారి జీవిత రేఖలను పరిచయం చేశారు.
సభలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న సాహితీ వేత్త శ్రీ కేతవరపు శివరామకుమార్ “గీతామృతం” గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీమతి కల్యాణి ప్రార్ధనాగీతంలో ఆరంభమైన ఈ సభ శ్రీ పురాణం రామకృష్ణశాస్త్రి వందన సమర్పణతో ముగిసింది.