విద్యతో పాటు వివిధ సాంస్కృతిక రంగాలలో పురోగమిస్తున్న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఇటీవల మరోమారు విజయభేరి మ్రోగించారు.
2014 నవంబరులో బాపట్ల – శ్రీరామకృష్ణ సేవాసమితి నిర్వహించిన తెలుగు వ్యాస రచన పోటీలలో డిగ్రీ స్థాయిలో ప్రథమ బహుమతిని చి॥ గుంటూరు వెంకటాచారి (పి.డి.సి. తెలుగు – 2 విద్యార్ధి),
తృతీయ బహుమతిని చి॥ ఉన్నగిరి త్రిపుర ఆంజనేయులు (పి.డి.సి. తెలుగు-1 విద్యార్ధి).
తెలుగు వ్యక్తృత్వం పోటీలో తృతీయ బహుమతిని చి॥ గుంటూరు వెంకటాచారి (పి.డి.సి. తెలుగు-2 విద్యార్ధి)
భక్తి సంగీతం పోటీలో ప్రత్యేక బహుమతిని చి॥ కైతేపల్లి వెంకట సుబ్బారావు (బి.ఎ. సంస్కృతం-1 విద్యార్ధి) గెలుచుకున్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.ఎల్.సుగుణ, కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ విజేతలైన విద్యార్థులను అభినందిస్తూ, వీరి నుంచి స్ఫూర్తి పొంది తక్కిన విద్యార్థులు కూడా విద్యా సాంస్కృతిక రంగాలలో ప్రగతిని సాధించాలని హితవు చెప్పారు. “విద్యా స్వరూపిణి” అమ్మ అనుగ్రహ ఫలంగా కళాశాల అభివృద్ధి పధంలో ముందుకు సాగుతున్నందుకు అందరూ ఆనందించారు.