విశ్వమాతా ఛారిటబుల్ ట్రస్ట్ – విజయవాడవారు శ్రీపి. యస్. ఆర్. ఆంజనేయప్రసాద్ వ్రాసిన శ్రీ విశ్వజననీ వీక్షణం గ్రంధావిష్కరణ సభ 20.3.2013న దుర్గాపురంలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రంలో ఏర్పాటు చేశారు.
శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి గ్రంథావిష్కరణ అనుగ్రహభాషణ సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు అధ్యక్షత వహించారు. శ్రీ నిడుమోలు రమాసత్యనారాయణ సభా ప్రారంభం చేశారు. ఆత్మీయ అతిధిగా ప్రముఖన్యాయవాది, శ్రీ యాబలూరి లోకనాథశర్మ విచ్చేశారు. జిల్లెళ్ళమూడి విద్యాపరిషత్ అభివృద్ధి సంఘ అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు జ్యోతిప్రకాశనం చేశారు.
కావ్యాన్ని డాక్టర్ బి.యల్. సుగుణ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఆంధ్రశాఖాధ్యక్షులు సభకు పరిచయం చేశారు.
మధురభారతి శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సభానిర్వహణ చేసి సభికులు నానందింప జేశారు.
జయంతి చక్రవర్తి సభికులకు స్వాగతం పలికారు. వేద గంగోత్రి ట్రస్టు శ్రీ జి.వి.యస్.ఆర్.యస్.యస్.యస్. వరప్రసాద్ శుభాకాంక్షలు పంపారు.