“నిర్ణయించిన వాడూ నిర్ణయానికి బద్ధుడే” అని అమ్మ ప్రకటించింది. కనుక మనం. కాలాన్ని బట్టి, కష్టసుఖాలు అనుభవించాలి. ఆ కష్టసమయాల్లో మన వెన్నంటి వుండి “అమ్మ” కాపాడ్తుందన్న విషయం అమ్మ బిడ్డలందరికీ అనుభవమే. కాని కొన్ని వింతలు విశేషాలు జరిగినప్పుడు “అమ్మ”కు మనమీద ఉన్న దయ అవగతమవుతుంది.
మా వైజాగ్ మందిరంలో అనేక అనుభవాలు. దేనికదే ప్రత్యేకత సంతరించుకుంటుంది. చెక్ బుక్ మొదలు పెట్టినప్పుడల్లా అమ్మకు కొంత సమర్పించి మిగిలిన చెక్కులు వాడటం అలవాటు. ఆ మొదటి చెక్ భక్తులు ఇచ్చిన సొమ్ముతో, నేను తీసిన ఎమౌంటును కలిపి “కరూర్ వైశ్యా బ్యాంకు” లో మాతృశ్రీ అధ్యయనపరిషత్ పేరు మీద అకౌంట్లో వేస్తాను. నేను ఎవరికి ఇవ్వవలసినా చెక్లల రూపంలోనే ఇవ్వటం అలవాటు. ప్రతినెలా మా ఆఫీసు మేనేజర్ రాజ్యలక్ష్మికి చెక్ సంతకం చేసి ఇస్తాను. తాను డీటైల్స్ రాసి బ్యాంకులో జమ చేస్తుంది. అలాంటిది ఆ నెల 2,500 రూపాయలు అధ్యయనపరిషత్ ఎకౌంట్లో జమకాలేదు. దాని గురించి రాజ్యలక్ష్మిని అడిగాను. “నేను శ్రీ విశ్వజననీపరిషత్ జిల్లెళ్ళమూడి అకౌంట్ లో జమచేసానని” ఆమె చెప్పింది. ఇదేమిటి “నేను చెప్పింది ఒకటి. ఆమె చేసింది మరొకటి. అమ్మ ఎందుకు ఇలా చేయించింది. ఈ డబ్బు దేనికి ఉపయోగపడ్తుందా ! అని ఆలోచించాను. ఇంతలో ఒక మంచి ఆలోచన వచ్చింది. 25 అమ్మ డైరీలు తెప్పించుకోవచ్చు కదా ! అని. వెంటనే జిల్లెళ్ళమూడికి ఫోను చేశాను. శ్యామల ఫోను తీసింది, ఈ విషయం చెప్పాను” డైరీలు ఎక్కువ లేవు. 25 డైరీలు తీసి లక్ష్మణరావుగారికి ఇచ్చి మీకు అందచేయమంటాను” అన్నది. దానికి చాలా సంతోషమైంది. మళ్ళీ అవి చేరేదెలా అని ఇంటికి వెళ్ళి కుసుమకు ఈ విషయం చెప్పాను”. “మీకు చెప్పటం మర్చే పోయాను. జగన్నాథం ఫోను చేసి విజయవాడ నుంచి జయంతి చక్రవర్తి రిగార్డియా ఆఫీసుకు 40 డైరీలు పంపాడుట. మనకి 25, పూర్వ విద్యార్థులకు 15 డైరీలు పంపించాడని” చెప్పాడు అని చెప్పింది.
నా మతి పోయింది. నేను పంపమని ఎవరికీ చెప్పలేదు. సరిగా ఇక డైరీలకు నాకు తెలియకుండానే జిల్లెళ్ళమూడికి డబ్బు పంపటం, సరిగా ఆ పైకంకు సరిపడా, డబ్బుచేరకుండానే డైరీలు మాకు అందటం ఎంతో విడ్డూరం. మరునాడు ఆఫీసుకు వెళ్ళగానే పార్శిల్ వచ్చిందని లారీ ఆఫీసు నుంచి ఫోను రావటం. మా అందరికీ ఆశ్చర్యం, ఆనందమనిపించింది. వారం కాకుండా జరగవలసినవి అనూహ్యంగా జరగటం, వారం రోజుల్లోనే ఆ డైరీలు అయిపోయాయి, మళ్ళీ 25 డైరీలు కావాలని ఫోను చేసాను. ఆశ్చర్యం అక్కడా అయిపోయాయి. క్షణక్షణం మావెంట వుండి మాకు కావలసిన కోర్కెల (అవి మాకు తెలియక పోయినా) ను నెరవేరుస్తూ ‘క్షిప్రప్రసాదిని’ అన్న నామాన్ని.సార్థకం చేసుకుంటోంది అమ్మ.