జిల్లెళ్ళమూడిలో అమ్మ అనుగ్రహంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మాతృశ్రీ వేదపాఠశాల విజయ దశమినాడు ఓడరేవు నుండి వచ్చిన పూజ్యులు శ్రీశ్రీశ్రీ అరుళానంద స్వామీజీ వారి చేతులమీదుగా ప్రారంభింపబడింది.
సభాధ్యక్షులుగా శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యం. దినకర్ వేదప్రాశస్త్యాన్ని క్లుప్తసుందరంగా వివరించారు. శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు జ్యోతి ప్రజ్వలనం చేశారు. శ్రీ తంగిరాల వెంకప్పసోమయాజులు గారు అమ్మ వేదాలు చెప్పిన భావాలు ఎలా అందించిందో చెపుతూ వేదంలోని విభాగాలను గూర్చి ప్రసంగించారు. శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం వేదపాఠశాల కార్యదర్శి నివేదిక సమర్పించారు. శ్రీ రావూరి ప్రసాద్ అమ్మపాట పాడగా, పాఠశాల ఆచార్యులు శ్రీసందీప్ కుమార్ వేదపఠనం చేశారు. వేదవిద్యార్థులకు, ఆచార్యునకు అరుళానందస్వామికి, అతిధులకు అమ్మ ప్రసాదంగా నూతన వస్త్రాలందించారు. శ్రీవిశ్వజననీ పరిషత్ కార్యదర్శి శ్రీ వై.వి. శ్రీరామమూర్తి వందన సమర్పణ చేశారు.
తిరుపతి సంస్కృతవేద విశ్వవిద్యాలయ అసిస్టెంట్ రిజిష్ట్రారు శ్రీ మాజేటి రామకృష్ణాంజనేయులు తమ వంతు
సహాయ సహకారాలందించటానికి వాగ్దానం చేశారు. విశ్వజనని పత్రిక సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సభా సంచాలకులుగా వ్యవహరించారు.
తదనంతరం వేదపాఠశాల విద్యార్థులు నివాసభవనము, ఆచార్యుని నివాసం ప్రారంభించి విద్యార్థులకు బోధన ప్రారంభించటం జరిగింది.