“మనం కోటీశ్వరులం కాకపోవచ్చు. భావనకి పేదరికంలేదు. షోడశోపచారాల్ని, పూజని మానసికంగా పెద్ద మనసుతో చేసుకోవచ్చు. ఏమీ ఖర్చులేదు. ‘అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం’ అన్నారు శంకరాచార్యులు.
దైన్యం అంటే డబ్బులేకపోవటం కాదు; భగవన్నామ స్మరణ, ఆ అనంత కళ్యాణ గుణవైభవ స్ఫురణ లేకపోవటం”
– (జిల్లెళ్ళమూడిలో సత్సంగంలోని వారి ప్రసంగం నుండి)