1) 12.9.2013 గురువారం స్థానిక రైలు పేటలోని శ్రీ పాదర్తి వెంకన్నగారి ధర్మసత్రంలో సాధువులకు, వృద్ధులకు, వికలాంగులకు అన్నవితరణ కార్యక్రమం మాతృశ్రీ అధ్యయనపరిషత్, గుంటూరువారు జరిపారు. శ్రీ అన్నంరాజు మురళీకృష్ణ, శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్, శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావు గారలు కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డన చేసి తృప్తిని పొందారు. నాన్నగారి శతజయంతిలో ఇలా 100 చోట్ల యీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
2) 13.9.2013 శుక్రవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద గల స్టేషన్ రోడ్డులోని శ్రీ సాయిబాబా గుడివద్ద రిక్షాలాగుకొని జీవించేవారికి భిక్షకులకు, సాధువులకు, వృద్ధులకు అన్నవితరణ కార్యక్రమం జరిగింది. అధ్యయన పరిషత్ సభ్యులు పాల్గొని అమ్మను గూర్చి నాన్నగారిని గూర్చి చెప్పి ఈ అన్నవితరణలోని ధ్యేయం వివరించారు.
3) 14.9.2013 శనివారం స్థానిక రైలుపేటలోని శ్రీ రాళ్ళబండి చంద్రమౌళీశ్వరరావు గారి యింట్లో నిర్వహింపబడుతున్న శ్రీ మాతా వృద్ధాశ్రమంలో గుంటూరు మాతృశ్రీ అధ్యయన పరిషత్ అన్నవితరణ కార్యక్రమం నిర్వహించింది. శ్రీ పి.యస్.ఆర్. గారు అమ్మ వాత్సల్యాన్ని, అన్నవితరణను, నాన్నగారి సేవాతత్పరతను వివరించారు. అధ్యయనపరిషత్ కార్యదర్శి శ్రీ కట్టమూరివారు కార్యక్రమానికి తగు ఏర్పాటు కావించారు.
4) స్థానిక బ్రాడీపేట, 5వలైను, 16వ అడ్డరోడ్డు లోని అయ్యప్ప సేవా సమితివారు నిర్వహిస్తున్న దేవాలయ సముదాయం వద్ద జరిగే కార్యక్రమంలో బీదసాదలకు, వృద్ధులకు, అనాధలకు అన్నవితరణ చేయబడింది. శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావుగారు, పోతరాజు కృష్ణమూర్తిగారు, శ్రీ పార్థసారధిశర్మగారు కార్యక్రమానికి హాజరై సేవాకార్యక్రమాలలో పాల్గొన్నారు.