అమ్మ ఆశీస్సులతో, గురువర్యులు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారి సౌజన్యంతో ఆగస్టు మూడవ ఆదివారము 21వ తేదీన పాలకొండలో అన్నప్రసాదవితరణ కార్యక్రమం జరిగింది. సర్వశ్రీ మజ్జి సత్యం, అరటికట్ల హరిబాబు, దత్తి సూర్యనాయణ, బౌరోతు శంకర రావు, బౌరోతు సంతోష్ మొదలైన పూర్వ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమ్మ నామ సంకీర్తనతో మారుమ్రోగిన ఆ ప్రాంగణంలో ఆకలితో ఉన్న అమ్మ బిడ్డలు అమ్మ ప్రసాదంగా అన్నం తిని ఆనందించారు.
సంపాదక మండలి