‘వైద్యోనారాయణో హరిః’ అన్నారు ఋషులు. అంటే వైద్యుడు రోగికి నారాయణ స్వరూపుడు అని. కానీ అమ్మ, “వైద్యునికి రోగీ నారాయణ స్వరూపుడే” అని సంప్రదాయ భావనని సరియైన మలుపు త్రిప్పింది. అట్టి సరియైన దృక్పథంతోనే మాతృశ్రీ మెడికల్ సెంటర్ ఆవిర్భవించింది.
జనవరి నెల ఉచిత వైద్య సేవా శిబిరాలు
తేది : 8-1-2012; స్థలం : బాపట్లకు 8 కి.మీ. దూరంలో ఉన్న రామచంద్రపురం, బెస్తవారికాలనీ
లబ్ధిదారులు : 25 మంది బాలబాలికలు, 21 మంది స్త్రీలు, 31 మంది పురుషులు మొత్తం 77 మంది.
శిబిరాన్ని నిర్వహించిన వైద్యులు : 1. డా. ఎ. ఇనజకుమారి,ఎమ్.బి.బి.యస్, (పాపక్కయ్య) శ్రీ హైమానర్సింగ్ హోం, బాపట్ల, 2. డాక్టర్ సి. రామమోహనరావు, ఎమ్.డి., మెడికల్ ఆఫీసర్, మాతృశ్రీ మెడికల్ సెంటర్, జిల్లెళ్ళమూడి
సహాయకులు : ఆయా వైద్యశాలల సిబ్బంది : శ్రీ మతుకుమల్లి రాము, శ్రీమతి ఝాన్సీ, శ్రీమతి జయమణి, సో॥రాము (పాపక్కయ్య సోదరులు)
అనారోగ్య సమస్యలు : రక్తహీనత, పౌష్టికాహార లోపంతో పాటు జలుబు, దగ్గు, కీళ్ళ నొప్పులు, వ్యాధులు, చర్మవ్యాధులు, ఎముకలు విరుగుట, పుట్టుకతో అంగవైకల్యము. ఉచితంగా పంపిణీచేసిన మందుల ఖర్చు రూ.3,400
– శిబిర నిర్వహణ వ్యయం : రూ.5,000/
శిబిర నిర్వహణకై ఇటీవల అందిన విరాళాలు : 1) శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్, తమ అత్తగారు పొత్తూరి వరలక్ష్మమ్మగారి జ్ఞాపకార్థం, గుంటూరు. రూ.5,000/- 2) శ్రీమతి ఉషారావు, ఎమ్. హైదరాబాద్ రూ. 5,000/
స్పందన : నిరుపేదలైన కాలనీవాసులు 13 కి.మీ.ల ప్రయాణం చేసి బాపట్ల వచ్చి, ప్రయోగపరీక్షలు, వైద్యం నిమిత్తం ఒకరాత్రి, పగలు బాపట్లలో ఉండటం వారి శక్తికి మించినది.
‘అమ్మ ప్రసాదం’గా వైద్యం వారి గుడిసెల వద్దకు వచ్చింది. అది ‘దేవుడిదయ’ అంటూ సారనయనాలతో కృతజ్ఞత తెలిపారు.
విజ్ఞప్తి : మాతృశ్రీ మెడికల్ సెంటర్ ఉచిత వైద్య సేవా నిర్వహణకి మీ చేయూత నందించండి. మానవరూపంలో
ఉన్న మాధవిని అర్చించండి. ఒక ఉచిత వైద్య శిబిర నిర్వహణకు ఖర్చు : రూ.5,000/-లు (సుమారు)
తదుపరి వైద్య శిబిరం : 2012, ఫిబ్రవరి, మం॥ప్రా॥ ఉన్నత పాఠశాల, జిల్లెళ్ళమూడిలో 60 మంది బాలబాలికలు,
విద్యార్థులు)