`17.3.2013 : పట్టపుపాలెం రామచంద్రాపురంలో మాతృశ్రీ మెడికల్ సెంటర్వరు ఉచితవైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 70 మంది పేషెంట్స్ను పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేశారు. డాక్టర్ ఇనజకుమారిగారు, డాక్టర్ చల్లా రామమోహనరావు గారు, శ్రీ ఎమ్. రాముగారు, శ్రీమతి ఝాన్సీగారు పాల్గొన్నారు.
24.3.2013 : గోపాలపురం గ్రామంలో మాతృశ్రీ మెడికల్ సెంటర్ జిల్లెళ్ళమూడివారు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. డాక్టర్ ఇనజకుమారిగారు, డాక్టర్ శ్రీ చల్లా రామమోహనరావుగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరమునకు తులసి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వారు యోగా ఛారిటబుల్ ట్రస్ట్, గుంటూరు వారు తమ సహాయ సహకారములను అందించారు. బ్లడ్ షుగర్, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులు అందజేశారు. దాదాపు 300 మంది వైద్య సలహాలను, మందులను స్వీకరించారు.