రాబోయే హైమక్కయ్య పుట్టినరోజు హైమ 70వ జన్మదినోత్సవం. దానికి అంగభూతంగా కనీసం 7 కేంద్రాల్లో హైమ నామంతో ఏకాహం గానీ అర్ధ ఏకాహం గానీ జరిపించాలని శ్రీ విశ్వజననీ పరిషత్ నిర్ణయించింది. మార్చి 8 వ తారీఖున మాయింట్లో జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో మొదటి అఖండనామ పారాయణ కార్యక్రమం జరిగింది.
ఉదయం 7-30కు రవి అన్నయ్య వైదేహి అక్కయ్య పాల్గొన్నారు. దీపారాధన చెయ్యగా, వఝాప్రసాద్ అన్నయ్య, బి.జి.కె. శాస్త్రిగారు, కొబ్బరికాయలు కొట్టి, హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాచర్ల లక్ష్మీనారాయణ గారి అన్నయ్యగారి కుమార్తెలు శ్రీమతి అన్నపూర్ణ, రేవతిగార్లు వారి అన్నగారి కుమారుడు రమేష్ అతని భార్య సులోచన, ఉదయం 9 నుండి, రాత్రి 7-30 దాకా, అవిశ్రాంతంగా నామం చేస్తూనే ఉన్నారు. అన్నపూర్ణగారు “హైమ తెల్లటి దుస్తులలో ఆకాశం నుండి, మన ఇంటికి వచ్చి కూర్చున్నట్లు కనిపించింది అని చెప్పారు.
దాదాపు 70 మంది అందులో ఇంతకు ముందు పరిచయం లేని వారుకూడా నామపారాయణలో
రాత్రి 7-30కు లలితా సహస్రనామపారాయణ, అంబికా అష్టోత్తరం, మంత్రపుష్పంతో, పారాయణ పూర్తి అయింది. ఉదయం నుండి రాత్రి వరకూ 8 రకాల ప్రసాద వితరణ జరిగింది.