జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి హైదరాబాద్ వారు నెలవారి సేవా కార్యక్రమములలో భాగంగా 19.9.2011వ తేదీ సోమవారము హైయత్నగర్ కుంట్లూరు గ్రామములో గల వంశీరామరాజుగారి వెగెశా ఫౌండేషన్ వికలాంగ బాలబాలికల ఆశ్రమములో ప్రముఖ నేపధ్యగాయని శ్రీమతి వాణీ జయరాం సమక్షములో 280 మంది ఆశ్రమవాసులకి టవల్సు అందచేయబడినవి. ఈ కార్యక్రమములో అధ్యక్షులు శ్రీ వఝప్రసాదు, ఉపాధ్యక్షులు శ్రీ వల్లూరు రామమూర్తి, శ్రీమతి కనకదుర్గ, కార్యదర్శి శ్రీ వల్లూరు బసవరాజు, కోశాధికారి శ్రీ బి.జి.కె. శాస్త్రి, తదితరులు పాల్గొనినారు. శ్రీమతి వాణీజయరాం అమ్మను స్మరించుకొని ఈ కార్యక్రమమునకు ప్రశంసలు తెలియజేసారు. శ్రీ వంశీ రామ రాజు తమ కృతజ్ఞతలు తెలిపి అందరిని శాలువలతో సత్కరించినారు. కార్యక్రమము జయప్రదముగా ముగిసినది.
వెగెశా ఫౌండషన్
Unknown
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 10
Month : October
Issue Number : 4
Year : 2011
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.