మాన్యసోదరులు శ్రీ ఉపద్రష్ట మధుసూదనరావు గారు 1971లో ‘మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల’ స్థాపన కోసం రూ. 24,000/-లు విరాళాన్ని అందించారు. వారు బేగంపేటలో ఉండేవారు. వారికి Electrical Motors & Pump Sets ఉండేది. దాని adని ‘మాతృశ్రీ’ మాసపత్రికకు పంపి ప్రచురణకు ఆర్థిక సహకారాన్ని అందించారు. 1970 ప్రాంతంలో అమ్మ వర్ణచిత్ర కాలెండర్లను ముద్రించి సంస్థకు అందజేశారు. శ్రీ పన్నాలవారు కాలేజి పనిమీద వచ్చినపుడు యు.యమ్. రావు గారింట్లోనే బసచేసేవారు.
శ్రీ తంగిరాల శాస్త్రిగారు, శ్రీ చంద్రమౌళి వెంకట కృష్ణగారు, శ్రీ జి.కె. రావు గారు కలిసి శ్రీ జె. వెంకట రత్నం, శ్రీ శిష్టా సుబ్బారావు మున్నగు సోదరుల సహకారంతో 1971 లో Matrusri Vidya Parishad SOUVENIR ను హైదరాబాద్లో ముద్రించారు. సావనీర్ ప్రచురణ నిమిత్తంగా విరాళాన్ని సేకరించి కాలేజి స్థాపన, నిర్వహణ కోసం అందచేశారు.
ఒకసారి శ్రీ యు.యమ్. రావుగారు, శ్రీ టి.యస్. శాస్త్రిగారు, శ్రీ జి.కె. రావుగారలు, యు.యమ్.రావు గారి కారులో జిల్లెళ్ళమూడి వెడుతున్నారు. మార్గమధ్యంలో కారుచెడిపోయి, ఆగిపోయింది. ఆ క్లిష్టసమయంలో యు.యమ్.రావు గారు అన్నారు “అందరూ బిగ్గరగా అమ్మనామం చెప్పండి” అని. అందరూ ముక్తకంఠంతో అమ్మనామం చేయనారంభించారు. క్షణాల్లో కారు బయలుదేరింది, నిరాటంకంగా జిల్లెళ్ళమూడి చేరింది, వారిని చేర్చింది – సురక్షితంగా. అంతటి దృఢ విశ్వాసం వారికి అమ్మ యందు.
అమ్మ అనారోగ్యరీత్యా హైదరాబాద్ వచ్చినపుడు రాజగోపాలాచారి గారింట్లో ఉండి, తదనంతర కాలంలో పర్యటన చేసినపుడు శ్రీ జి.కె.రావు గారి కారులోనే వెళ్ళేది.
అలా హైదరాబాద్ సోదరులు ‘మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల’ అమ్మ అమృతహస్తాలతో ఆరంభ మైనదని
అందరూ దాని స్థాపన, Recognition, Grant- in -aid, development పరంగా విశేష కృషి చేశారు.