తెనాలి దగ్గర కరెవరం నుండి ప్రతి సంవత్సరం శ్రీ యల్.యల్.వి.జి.కృష్ణమూర్తిగారు, నిమ్మకాయరసంలో (వారికి పసుపుతోట, నిమ్మతోటలు ఉన్నవి) పసుపుకొమ్మలు నానబెట్టి ఆ పసుపుకొమ్ములతో తయారుచేసిన కుంకుమను అమ్మకు తెచ్చి పూజచేయటం అలవాలు. ఇది అమ్మ భౌతికంగా అమ్మ వారి తోటలు దర్శించిన నాటి నుండి జరుగుతున్న పని. అలాగే ఈ సంవత్సరం కూడా నిమ్మకాయ రసంతో తయారైన కుంకుమ తెచ్చి పూజ చేశారు. అంతేకాదు వారి తోటలో అమ్మ మామిడి మొక్క నాటింది. అది తుఫానులకు తట్టుకొని ఇప్పటికీ నిలచి ఉంది. ఆ మామిడికాయలు జిల్లెళ్ళమూడి తెచ్చి పంచడం కూడా ఒక నియమమే వారికి. సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసినా ఇప్పటికీ ఈ పూజాకార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులాగా – రాధాకృష్ణులలాగా భార్యభర్త లిద్దరూ మొన్న హైమవతీ వ్రతానికీ, నిన్న జనరల్ బాడీ సమావేశానికి రావటం విశేషం.
విజ్ఞప్తి
శ్రీ రావూరి ప్రసాద్ చేసిన అమ్మతో మీ అనుభవాలు ‘వీడియో ఇంటర్వూ’ కార్యక్రమంలో పాల్గొన్న సోదరీ ‘సోదరులు తమ వద్ద అమ్మతో గాని, హైమతో గాని తీసుకున్న ఫోటోలు గాని, అమ్మగాని – హైమగాని మీకు వ్రాసిన ఉత్తరాలు ఉంటే మీ ఇంటర్వ్యూతో పాటు చూపించటానికి పంపగలరు. వాటిని మళ్ళీ స్కాన్ చేసికొని త్రిప్పి పంపగలము. అంతేగాక మీరు వ్రాసిన గ్రంథాలు గాని, మరియే ఇతర విశేషాలు గాని మిమ్మల్ని గూర్చి చెప్పదగినవి తెలియజేయగలరు.