1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆర్కపురి విశేషాలు

ఆర్కపురి విశేషాలు

Nadendla Lakshmana Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 1
Month : January
Issue Number : 6
Year : 2002

నవంబరు 21:1985లో అమ్మను చూచి శ్రీ త్రిపురనేని పాండురంగ విఠల్ దంపతులు. గుడివాడ నుండి వచ్చి అమ్మను దర్శించారు. వారి సతీమణికి అమ్మ కలలో కనుపించారు. గుడివాడ వచ్చి అమ్మ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయ వలసిందిగా కోరారు.

 నవంబరు 30: డాక్టర్ యం. రామస్వామి బెంగుళూరు నుండి వచ్చారు. తిరువన్నా మలైలో ఒక గురూజీ నాడీ గ్రంథం చూచి రామస్వామిగారిని జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మకు పూజచేసుకొని రమ్మని చెప్పారట. డిసెంబర్ 1: ఏలూరు పంజాబ్ నేషనల్ బాంక్ ఉద్యోగి శ్రీ కె.జె. యస్. సత్య నారాయణగారు సతీ సమేతంగా అమ్మను దర్శించారు. హైమవతీ దేవి జన్మదిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. వస్తుతః కమ్యూనిష్టు అయిన వారికి జిల్లెళ్ళమూడి వదలి వెళ్ళాలనిపించటం లేదట. స్వప్నంలో అమ్మ దర్శనమిస్తున్నదట. నిజమైన కమ్యూనిజం అద్వైతమే అని అమ్మ చెప్పింది. కదా!

కుమారి నందమూరి వెంకట రమణ – శ్రీ బి.జి.కె. శాస్త్రి దంపతులు హైమవతీ జనయిత్రీ వ్రతంలో ఆసాంతం శ్రద్ధగా పాల్గొన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శాస్త్రి గారి కుమారునకు అమ్మ కనిపించిందట.

సోదరులు ఐ. రామకృష్ణ – కామరాజు – ధర్మసూరి ఈ నెల 24న జిల్లెళ్ళమూడి వచ్చి హేమ విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ఏర్పాట్లకు తగు సలహాలిచ్చారు. నందిగామ – ఆయల వరలక్ష్మి శ్రీ రాచర్ల లక్ష్మీ నారాయణ హైమ జన్మదినోత్సవం. సందర్భంగా ప్రసాదాలు భోజనాలు ఏర్పాటు చేశారు.

స్వీడన్ దేశస్థురాలు మేరీ థెరిస్సా గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనే అంశం వైవి. హెచ్.డి. చేస్తున్నారు. జిల్లెళ్ళమూడిలో మూడు రోజులుండి విషయసేకరణ కావించారు.

డిసెంబరు 6: శ్రీ టి. రామారావు రాజేశ్వరి దంపతులు గుంటూరు నుండి సేవించుకున్నారు. రాజేశ్వరికి వచ్చి అమ్మను అమ్మే ఆ పేరుపెట్టిందట. సంతానం విషయం లో బాధపడుతుంటే అమ్మ కనుపించి ఓదార్చిందట.

శ్రీ కొలకలూరి నాగరాజు గారు బెంగు ళూరు నుండి వచ్చి అమ్మ ఆలయంలో కలి గిన ప్రశాంతస్థితి ఎక్కడా కలుగ లేదన్నారు.

డాక్టర్ పింగళి రవి కిరణ్ జిల్లెళ్ళమూడి విద్యాలయంలో చదువుకున్నాడు చిన్నప్పుడు. మచిలీపట్నం నుండి సతీసమేతంగా వచ్చి పూర్వ స్మృతులు నెమరు వేస్తూ పులకించారు.

హైమవతీ దేవి జన్మ దినోత్సవానికి ఏటా అన్నంగి గ్రామం నుండి ఇరువురు సోదరు లను పిలిపించుకొంటుంది వారికి కనుపించి. ఈ సారి ‘పాల తాలికలు’ కావాలని హైమ వారిని కోరిందట. తాను జిల్లెళ్ళమూడి లో ‘భ్రమరాంబ’ అక్కయ్యకు కనిపించా నని చెప్పారట. అంతే వారు జిల్లెళ్ళమూడి రావడం భ్రమరాంబ గారికి చెప్పటం – పాలతాలికలు చేయటం – నివేదించటం అన్నీ హైమ ఇష్టప్రకారం జరిగాయి.

హైమ జయంతి వైభవంగా జరిగింది. 59 నివేదనలు శ్రీ విశ్వజననీ పరిషత్ కాక స్థానిక నివాసి శ్రీ లక్ష్మీ నారాయణగారు కూడా 59 నివేదనలు తీసికొనివచ్చి నివేదిం చారు హేమకు. శ్రీ ఐ. హనుమబాబు కార్యక్రమ నిర్వహణ భారంవహించారు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!