ఫిబ్రవరి 17 వ తేదీ, ధాన్యాభిషేకం, అంటే జగత్పిత నాన్నగారి ఆరాధనోత్సవం. ఆ ఉత్సవం ‘మానవ సేవే మాధవ సేవ’ అనే ఆప్తవాక్యానికి ఆచరణ రూపం…
నాడు సోదరీ సోదరులందరూ ఆది దంపతులైన అమ్మ నాన్న గారలను బియ్యంతో ధాన్యంతో అభిషేకిస్తారు. ఒక వైపు అన్నం బ్రహ్మ’ అంటూ ఉత్సవమూర్తులకు వేదమంత్రాలతో అభిషేకం చేయటం మాధవసేవ, మరొకవైపు ఆ ధాన్యం/బియ్యం అన్నపూర్ణాలయంలో ఏడాది పొడవున ‘అమ్మ మహాప్రసాదం’ గా అన్నరూపేణా వడ్డించటం మానవ సేవ.
అంటే ధాన్యాభిషేక ఉత్సవం ఇహపర సౌఖ్యవదాయకం. కనుకనే పరిసర గ్రామాలు, దూరసుదూర ప్రాంతాల్లోని వ్యవసాయదారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆబాలగోపాలం ఎందరో. అమ్మ నాన్నగారి యందలి అకుంఠిత భక్తి విశ్వాసాలతో శ్రమించి, బంధు మిత్రులను ప్రోత్సహించి. విరాళాలను సమీకరించి, ప్రత్యక్షంగానూ on line లోనూ సమర్పించి ఈ సం.ము ఉత్సవాన్ని జయప్రదం – ఫలప్రదం చేశారు.
సహృదయులైన అట్టి సోదరీ సోదరులందరికీ పేరుపేరున కృతజ్ఞతాభి వందనములు, మనందరిపై వాత్సల్యామృత వర్షిణి అమ్మ శుభాశీస్సులు సదా వర్షించుగాక!!
– శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్,
శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్ట్, జిల్లెళ్లమూడి.