మా ఇంట్లో ప్రతి శుక్రవారం అమ్మ పూజ 1974 నుంచి అవిచ్ఛిన్నంగా జరుగుతోంది. శుక్రవారం పూజకు దండలు కూడా కట్టలేదు. ఒంట్లో ఏమి బాగాలేదు. చాలా దిగులుగా వుంది. మళ్ళీ ఆసుపత్రిపాలు అయి అందర్నీ ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని బాధ అనిపించింది. అలాగే లేని ఓపిక తెచ్చు కుని పూలు కట్టాను. మందులడోసు పెంచి వేసుకున్నాను. కానీ తెరిపి ఇవ్వలేదు. విపరీతమైన దగ్గు, ఆయాసం. ముందు రోజు జన్మభూమి కార్యక్రమంలో తుక్కు అంతా మంట పెట్టారు. ఆ పొగవల్ల, సాయంత్రం పార్టీ అయితే ఆరుబయట కూర్చోవటంతో మంచువల్ల అంత బాధపడ్డాను. గుండెల్లో నొప్పో, దగ్గో, కీళ్ళనొప్పో అర్ధం కావటం లేదు. తగ్గుతుందన్న ఆశ ఏ కోశాన కన్పించటం లేదు. పూజకు వెళ్ళి కామ్ కూర్చు న్నాను. పూజ అవుతున్నప్పుడు ఈ రోజు ఎవరైనా అమ్మ బొట్టు పెడితే నాకు తగ్గుతుంది లేకపోతే ఆసుపత్రికి వెళ్ళా అని అనిపించింది.
కృష్ణ కూడా ఇంట్లో లేడు. ఆయన ఖంగారు పడ్డారు. సరే మెల్లిగాలేచి అమ్మ. కుంకుమ నేనే పెట్టుకున్నాను. నా మనస్సులో ఎవరైనా నేను అడగకుండా అమ్మ కుంకుమ పెట్టాలని, పెడితేనే తగ్గుతుందన్న ఆలోచన వచ్చింది.
ఈ లోగా జి.యస్.యన్. మూర్తి గాని భార్య సీతగారు వాళ్ళ పెద్ద కోడలు కైలాసగౌరి నోము ఆదివారం నోచుకుం టుందని బొట్టుపెట్టి మరీ పిలిచారు. నా ఆనందానికి అవధులు లేవు. ఆరోజు సగ్గుజావ త్రాగి నిద్రమాత్ర వేసుకుని పారాయణం చేసుకుంటూ పడు కున్నాను. బాధ మాత్రం తగ్గలేదు. అలా ఎప్పటికో నిద్ర పట్టింది.
కలలో శ్రీశ్రీశ్రీ పూర్ణానంద స్వామీజీ” మేడమీద వారి ఇంటికి వచ్చినట్లు తెలిసింది. ఆయన దర్శనం చేసుకుని మా ఇంటికి ఆహ్వానించాలని ఎంతగానో వుంది. కానీ లేవలేని స్థితి ఏమిటమ్మా! ఇలాంటి విషమ పరీక్ష పెట్టావని అమ్మనే ప్రార్ధించాను. ఇంతలో స్వామీజీ క్రిందకు మా ఇంటికి వచ్చి మా పూజలో పెట్టే యంత్రాలను, విగ్రహాలను చూస్తున్నారు. నేను వెళ్తామనుకుంటే ఆయనే వచ్చారే! అన్న ఆనందంతో అప్పటి వరకూ లేవలేని స్థితిలో వున్న నేను గబ గబా లేచి వెళ్ళి నమస్కారం చేసు కున్నాను. ఆతరువాత బాగా నిద్ర పట్టింది. నాకు ధైర్యం చెప్పటానికే అమ్మ సీతగారి చేత బొట్టు పెట్టించటం, ఆ రాత్రి స్వామీజీ కలలోకి రావటం జరిగింది. అమ్మ అనురాగ మూర్తికదా ! ఎవరు బాధ పడ్తున్నా చూడలేదు. తన వాత్సల్యామృ త వృష్టిని మనపై కురిపిస్తుంది. స్వామీజీ ఆశీస్సులు సర్వదా మాకు వున్నాయని తెలియజేయటానికే ఆయన కలలోకి వచ్చారని నా దృఢ విశ్వాసం.