శ్రీ బి.యల్.యస్.శాస్త్రి
వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం – ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం : Planning advisor to Collector, E.G.Dt.
సేవాతత్పరత : 1973 నుంచి అమ్మ సన్నిధికి వస్తూ అమ్మ విశ్వజనీన మాతృప్రేమకు ముగ్ధులై, అమ్మ అపూర్వ తత్త్వానికి అంజలి ఘటించారు. ‘పదార్చన – 3 భాగాలు’, ‘కృష్ణం వందే జగద్గురుం’ (నృత్యనాటిక), ‘బోధేకార్యం కథంభవేత్’, ‘తెలుగులో మహావాక్యం’, ‘అక్షరం వీధిన పడింది’, ‘సబ్రహ్మ స శివస్సహరిస్సోక్షరః’ ‘Mandookyopanishad – a study’ అనే గ్రంథాల్ని రచించి అమ్మ వాక్యాలు ‘తెలుగులో మహావాక్యాలు’ అని ఎలుగెత్తి చాటారు. జిల్లెళ్ళమూడిలోని అమ్మ సేవాసంస్థల నిర్వహణకు ఉదారంగా విరాళాలిచ్చి తమ వంతు సహకారాన్ని అందించారు. SVJP వివిధ స్థాయిలలో నిర్వహణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి అమ్మ అనుగ్రహాశీస్సులకు పాత్రులైనారు.
శ్రీ రావూరి ప్రసాద్ 27-1-2014వ తేదీన కాకినాడలో శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణ శాస్త్రి గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం
*********
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments