Sadguru Sri Sivananda Murthy

Interviewed by
Ravuri Prasad
14/12/2014
Bheemunipatnam

 

సద్గురు శ్రీ శివానన్దమూర్తి

  వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య – శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. విద్య B.SC. . వృత్తి – హన్మకొండ పోలీసుశాఖలో ఉద్యోగం. వారు 10-06-2015న శివైక్యం చెందారు.

ప్రవృత్తి : వీరు మహాశైవ పీఠాధిపతులు, యతీశ్వరులు, మహాజ్ఞాని, త్రికాలవేది, తంత్రవేత్త, తత్త్వవేత్త, శాస్త్రవేత్త, సాహితీవేత్త, మానవతావాది.
‘కఠయోగం’, ‘భారతీయత’, ‘మార్గదర్శకులు – మహర్షులు’, ‘భీష్మబోధ’ వంటి అనేక గ్రంథరచనలు చేశారు. జిల్లెళ్ళమూడి అమ్మ వారిని “లోకబంధువు” అని సమ్మానించింది.
సనాతన ధర్మ ప్రచారం కోసం, భారతీయ సంస్కృతి వారసత్వం గురించి బోధించటం కోసం, సనాతన ధర్మఛారిటబుల్ ట్రస్టును స్థాపించారు. పేదలకు ఉచిత వైద్యసేవలనందించారు.

మా మాట

శ్రీ సద్గురు శివానందమూర్తిగారిని శ్రీ రావూరి ప్రసాద్ 14-12-2014న భీమునిపట్నం, ‘ఆనందవనం’ ఆశ్రమంలో ఇంటర్వ్యూ చేయ ప్రయత్నించగా తీవ్ర అస్వస్థతతో వున్నారనీ వీలుపడదని తెలిసింది. అనేక ప్రయత్నాల పిమ్మట కేవలం 5 నిమిషాల దర్శనమేవుంటుందనీ, ఏ రకమైన ఇంటర్వ్యూ వారిచ్చే స్థితి లేదనీ, అందుకు సమ్మతమైతే రావచ్చని తెలియవచ్చింది.
కనీసం వారి రూపాన్నయినా చిత్రీకరించాలనే ఆశతో విశాఖపట్టణం సమీపాన భీమిలిలో ‘ఆనందవనం’ వారి ఆశ్రమానికి చేరుకొన్నాం. రెండుగంటల అనంతరం మాకు వారి దర్శనం లభించింది. పండుటాకులా దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ మూర్తికి ప్రణమిల్లాం. వారిని చిత్రించే క్రమంలో ‘అమ్మ’ యందు వారికి గల ఆత్మానుబంధంతో ఎంతో నీరసంగా వున్నా ఉద్వేగభరితులై పదినిమిషాలు అనర్గళంగా ప్రసంగించారు. అమ్మని గురించి వారు చేసిన ప్రసంగ సారాన్ని మీ ముందుంచుతున్నాము.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

Related Interviews …

0 Comments