శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్
వీరు సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామంలో 30-4-1939న జన్మించారు. జననీ జనకులు శ్రీ పోతరాజు పురుషోత్తమరావు, శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, భార్య – శ్రీమతి వెంకట జయలక్ష్మీ శేషగిరిబాల. సంతానం ముగ్గురు కుమారులు. విద్య బి.ఎ., ఉద్యోగం ~ మాజేటి గురవయ్య హైస్కూల్, గుంటూరులో Senior Assistantగా పదవీ విరమణ చేశారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి సోదరులు వీరు.
సేవాతత్పరత : “అమ్మ”, నాన్నగారు, సుబ్బారావు అన్నయ్య, రవి అన్నయ్య, హైమక్కయ్య అందరూ వీరింటికి వచ్చారు. అమ్మ కుటుంబ సభ్యులలో ఒకరిగా ఆదరించబడ్డారు. గత 15 సంవత్సరాల నుండి సమర్థవంతంగా ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులుగా కృషి చేస్తున్నారు. అడుగడుగునా అమ్మకారుణ్యాన్ని అమోఘశక్తిని దర్శించి పరవశిస్తున్నారు. అమ్మను గురించి ‘విశ్వజననీ వీక్షణం’, ‘ఆనందనందనం’, ‘మాతృశ్రీ దర్పణం’, ‘గిరిబాల గీతాలు’ వంటి అనేక గ్రంథాలు రచించారు. అమ్మ స్వయంగా వీరిని ‘ఈస్థానకవి’ అని అభిమానించింది. వివిధ కోణాల్లో అమ్మపై ఎవరు రచనలు చేసినా అవి తక్షణం వెలుగు చూడాలని నిరంతరం తపించే అమ్మ ముద్దుబిడ్డ. SVJP కార్యక్రమాల్లో, అమ్మ తత్త్వ ప్రచార కార్యక్రమాల్లోనూ త్రికరణశుద్ధిగా తన వంతు సేవలనందిస్తారు. ప్రస్తుతం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంటుగా కూడా వ్యవహరిస్తున్నారు.
శ్రీ రావూరి ప్రసాద్ 01-9-2012వ తేదీన బాపట్లలో శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.
****************
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments