అమ్మ చెప్పింది “నీ దృష్టి ఎట్లాంటిదో సృష్టి అలా కనిపిస్తుంది” అని. వారివారి స్థాయిని బట్టి అమ్మని అర్థం చేసుకుంటారు. ఉదాహరణగా చెప్పాలంటే Abdul Kalam వచ్చి ఉపన్యసిస్తుంటే ప్రాథమిక స్థాయి, లేక హైస్కూల్, కాలేజి, యూనివర్సిటీ కుర్రవాడో, Scientist వచ్చారనుకోండి. వాళ్ళు దానిని అర్థం చేసికోవటం వాళ్ళ మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. ముందు వాళ్ళు అర్ధం చేసుకోలేకపోయారే అని బాధపడాల్సిన పనిలేదు. ఎలిమెంటరీ స్థాయిలో ఉన్నవాళ్ళని Scientist స్థాయికి తీసుకెళ్ళిననాడు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తీ అర్థం చేసుకుంటాడు. అందుకనే Education is very important. we have to educate the people until and unless they can receive the reality. జ్ఞానమే చాల ముఖ్యమైనది. ఒక మహాత్ముడు గాని యోగిగాని అవతారమూర్తిగాని చెప్పేది వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళంతా ఆచరిస్తారా అంటే ప్రశ్నార్థకమే. వాళ్ళవాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఆచరిస్తారు. ఆచరించడంలేదే అని మనం బాధపడకుండా, వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నమ్మకం, విశ్వాసం, గురితో ఆచరించేట్టుగా చేయాలి. చిన్నపిల్లవానికి మందు యొక్క పద్దతి తెలిసినా తెలియక పోయినా, దాని ప్రయోజనం తెలిసినా తెలియకపోయినా మనయందు గురి, విశ్వాసం, నమ్మకంతో మనం చెప్పినట్లు ఆ మందు తీసుకుంటే ఫలితం పొందుతాడు. ఇది కూడా అంతే. అందుకే ఒక ఆధ్యాత్మికవేత్తగానీ, ఒకయోగికానీ, ఒక సిద్ధపురుషుడు గానీ అందరినీ ఆకర్షించి ప్రేమతో దగ్గరకు తీసుకుని వాళ్ళు జ్ఞానవంతులైనా కాకపోయినా తాము చెప్పిన దానిని వాళ్ళు ఆచరించేట్టు చేసుకుంటారు.
అమ్మ వాక్యం “ఇష్టమైతే కష్టం లేదు”- ఎంత చక్కని మాటో చూడండి. “భరించగలిగితే బాధ లేదు”. “సహించగలిగితే హింస లేదు” – అన్నదానికంటే మించినది లేనే లేదసలు. ఇది కనుక మనం ఆచరణలో పెడితే- మన ఇష్టత పెంచుకుంటే ఎంత కష్టాన్నైనా భరించగలం. బాధలెన్ని ఉన్నా వాటిని మనం భరించగలిగితే బాధలేదు. అట్లాగే ఎంతగా హింసించాలని ప్రయత్నించినా మనం అన్నీ సహిస్తే హింసలేదు. ఓర్పు, సహనం ఎంతో ముఖ్యమని చెప్పింది అమ్మ.
అమ్మ ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం తిన్న అన్నమే రక్తంలోకి వెళుతున్నది. ఆ రక్తమే, nervous system brain కి వెడుతోంది. ఎటువంటి ఆహారమో అటువంటి రక్తము; ఎటువంటి రక్తమో అటువంటి మనస్సు; ఎటువంటి మనస్సో అటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలో అటువంటి పనులు; ఎటువంటి పనులో అటువంటి ఫలితం మనం పొందుతామనే యదార్థమైన వైదిక సంప్రదాయ ఫలితంగా వేదసమ్మిశ్రితమైన ఒక సత్యాన్ని సమాజానికి అందించింది. అమ్మను అర్థం చేసుకోలేక మనం తికమకపడుతున్నాం; అర్థం చేసుకున్నవాళ్ళు బాగుపడతారు; లేనివాళ్ళు అయోమయంలోనే ఉంటారు.
అన్నదానం కంటె మించిన దేదీ లేదు. మనకి ఆహారం ద్వారానే శక్తి రావాలి. శక్తి అంతటావ్యాపించి ఉంది. సైన్స్ ప్రకారం, వైద్యశాస్త్రరీత్యా కూడా ఆహారం నుంచే మనకి శక్తి వస్తోంది- Iron, calcium, potassium, proteins, fats అన్నీ ఆహారం నుంచే. మనం ఇతరులను శక్తివంతం చేయడం అంటే ఆహారాన్నివ్వటమే. జ్ఞానాన్ని అందించటమూ, ఆహారాన్నివ్వటమే. అన్నిటినీ మించింది శక్తిని ప్రసారం చేయటం. రామకృష్ణ పరమహంసవలె అమ్మవలె మనం శక్తిని ప్రసారం చేసే స్థాయికి వెళ్ళలేదు కనుక ఆహారాన్నిచ్చి శక్తివంతం చేయాలి. ఆహారం కొరత అన్ని అనర్థాలకూ మూలం. అందరికీ కడుపునిండా ఆహారం, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, పిల్లలకి విద్య, ఆరోగ్యం ఉంటే- అసలు అలజడే లేదు. అంతా బాగుంటారు. ఇది నేను చెపుతున్నాను, ప్రపంచమంతా చెపుతున్నది. ఐక్యరాజ్యసమితిలో కూడా నేను ఘోషించింది Five Essentials- ఆహారం, బట్ట, ఇల్లు, విద్య, ఆరోగ్యం. ఈనాడు శక్తివంతమైన దేశం అని చెప్పుకునే అమెరికాలో కూడా ఈ 5 లేనివాళ్ళు చాలమంది ఉన్నారు. దీనిని అమ్మ గ్రహించింది. వీటికోసం ఒక ప్రణాళిక నేర్పరచుకున్నది. సాంఘికసేవ – భగవంతునికి నువ్వు ఏంచెయ్యగలవు? సర్వం ఇచ్చే భగవంతునికి నువ్వు ఇవ్వవలసిన పని ఏమిటి? ఆయనకి ఇస్తున్నాననుకుని ఆయన సంతానమైన సమాజానికి ఇవ్వాలి. ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వాలి.
0 Comments