శ్రీ రాజుపాలెపు వెంకట శేషగిరిరావు
ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామంలో 08-11-1942 న వీరు జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ రాజుపాలెపు రామచంద్రరావు, శ్రీమతి సీతారత్నం. భార్య శ్రీమతి పద్మావతి. సంతానం- ఇద్దరు మగపిల్లలు. విద్య M.A.B.Ed; ఉద్యోగం-Professer in English. 07-06-2015 తేదీన పరాత్పరి అమ్మలో ఐక్యం అయినారు.
సేవాతత్పరత: బాల్యంలోనే అమ్మ సన్నిధి చేరి పుష్కలంగా దివ్య మాతృ ప్రేమని పొందారు. వీరి హృదయంలో అమ్మ సుప్రతిష్ఠిత అయింది. వీరికి అమ్మ 3 సార్లు ప్రాణదానం చేసింది. అమ్మ ప్రేమతో పాటు హైమక్క ప్రేమను పొందిన ధన్యులు. ‘రాగబంధం’ అనే స్వీయరచనలో అమ్మ మహనీయ తత్త్వాన్ని ఆవిష్కరించారు. తండ్రి రామచంద్రరావు గారి డైరీలలోని అమ్మ అలౌకిక మహిమాన్విత సంఘటనలు భావితరాలకై వీరు భద్రపరిచారు. అందులో కొన్ని ఇప్పటికే ప్రచురించబడ్డాయి.
శ్రీ రావూరి ప్రసాద్ చేసిన 12-3-2012 న హైదరాబాద్లో శ్రీ రాజుపాలెపు వెంకట శేషగిరిరావుగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.
*********
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments