శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి – (కుర్తాళ పీఠాధిపతులు)
వీరు 23.1.1937వ తేదీన జన్మించారు. స్వగ్రామం సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామం. తండ్రి శ్రీ పోతరాజు పురుషోత్తమరావు, తల్లి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి. భార్య శ్రీమతి దుర్గాత్రిపుర సుందరీదేవి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె గలరు. తోబుట్టువులు – నలుగురు సోదరులు, ఒక సోదరి. విద్య M.A.Ph.D. వృత్తి – Retd. Principal, Hindu – College, Guntur. ప్రస్తుతం కుర్తాళం, సిద్ధేశ్వరీ పీఠాధిపతులు. ఆశ్రమనామం పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి.
ప్రవృత్తి : అవధాని కులావతంసునిగ, ఆశుకవి చక్రవర్తిగా, సాహిత్యరూపక సమ్రాట్ దేశవిదేశాల్లో విఖ్యాతి పొందారు. కఠోర తపస్సు చేసి లలిత, కాళీ, కాలభైరవ, బృందావనేశ్వరి రాధాదేవి వంటి ఎందరో దేవతలను ప్రసన్నము ప్రత్యక్షము చేసుకున్నారు. అంతర్నేత్రంతో భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగిన మహామహిమాన్విత యోగులు.
జగద్గురువులుగా, పరమహంసలుగా, పరివ్రాజకాచార్యులుగా ఎందరికో సన్యాసదీక్షను ప్రసాదించారు; స్త్రీలకు యోగినీదీక్ష నిచ్చారు.
జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి 1960 నాటికే ‘అంబికాసాహసి’ అనే వేయి పద్యాలు, శ్లోకాలు రచించారు. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన అనంతరకాలంలో అమ్మను ఆవాహనచేసి మాట్లాడిన మహిమాన్వితులు..
సెల్ నెం : 9490369800
ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు గారు 08-12-2011న కుర్తాళంలో శ్రీ స్వామివారితో చేసిన ఇంటర్వ్యూ సారాంశం.
******
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments