శ్రీ భాస్కరన్నయ్య (యార్లగడ్డ భాస్కరరావు)
వీరి వయస్సు 90 సం॥లు పైబడింది. స్వగ్రామం రేపల్లె తాలూకా సింగుపాలెం. తల్లిదండ్రులు శ్రీ యార్లగడ్డ వెంకటరత్నం, శ్రీమతి మాణిక్యమ్మ, భార్య – శ్రీమతి రాజ్యలక్ష్మి, సంతానం ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 4వ తరగతి వరకు చదువుకున్నారు. వృత్తి – వ్యవసాయం.
సేవాతత్పరత: జనక మహారాజు లాగా తాను సంసారంలో వున్నా, తనలో సంసారం లేకుండా 1960 నుండి ఇప్పటివరకు నిరంతరం అమ్మ సేవలో తమ జీవితాన్ని పునీతం చేసుకుంటున్న కర్మయోగి.
“నా చరిత్ర పండితుడైన పామరుడు వ్రాయడు, పామరుడైన పండితుడు వ్రాస్తాడు” అని ప్రకటించిన “అమ్మ” తన చరిత్రను వీరికి చెప్పి రాయించింది. అందుకే వీరు ‘పామరులయిన పండితులు, అమ్మ ఎంచుకొని తను దరి చేర్చుకొన్న అదృష్టవంతులు.
వీరు 12 ఏప్రియల్, 2018న తన 95వ ఏట జిల్లెళ్ళమూడి పవిత్రక్షేత్రంలో అమ్మలో ఐక్యమయినారు.
శ్రీ రావూరి ప్రసాద్ 11-10-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీ యార్లగడ్డ భాస్కరరావుగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.
*********
గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో కొంతమేర భాషను సరిచేయటమైనది.
0 Comments